Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో 15 రోజుల్లో వివాహం.. కబళించిన రోడ్డు ప్రమాదం

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2023 (09:56 IST)
కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. మరో 15 రోజుల్లో పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన ఓ యువజంటను రోడ్డు ప్రమాదం కబళించింది. జిల్లాలోని జగ్గంపేట మండలం, జె.కొత్తూరుకు చెందిన మానేపల్లి రాజకుమార్ (25) అనే యువకుడికి కిర్లంపూడి మండలం సోమవారానికి చెందిన మలిరెడ్డి దుర్గాభవాని (18)కి వచ్చే నెల పదో తేదీన వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారు. వీరికి ఇటీవలే నిశ్చితార్థం కూడా జరిగింది. 
 
మంగళవారం వారిద్దరూ కలిసి తూర్పుగోదావరి జిల్లా గౌరీపట్నం మేరీమాత ఆలయానికి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మార్గమధ్యంలో వెనుక నుంచి వచ్చిన ఓ లారీ వారిని ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments