Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేతిబీరలో నెయ్యి ఎంత ఉంటుందో.. వైకాపా సామాజిక న్యాయం అంతేవుంది : వైకాపా ఎమ్మెల్సీ

ఠాగూర్
సోమవారం, 12 ఫిబ్రవరి 2024 (15:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తుంది. అధికార పార్టీలో రెబెల్ ప్రజాప్రతినిధుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. తాజాగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పార్టీకి వ్యతిరేకంగా గళం వినిపించారు. తమ వైకాపాలో సామాజిక న్యాయం అనేది లేదన్నారు. నేతిబీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో వైకాపాలో సామాజిక న్యాయం కూడా అంతేనని ఆయన వ్యాఖ్యానించారు. 
 
పార్టీలోని బీసీ నేతలకు ఎక్కడా న్యాయం జరగడం లేదన్నారు. గౌరవ మర్యాదలు మచ్చుకైనా కనిపించవన్నారు. ప్రోటోకాల్‌కు అనే మాటకే తావు లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీసీలు తమ సంక్షేమం కోసం కాకుండా ఆత్మగౌరవం కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బీసీలు పార్టీకి దూరమవుతున్నారని, దీనిపై వైకాపా పెద్దలు పునరాలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 
 
ముఖ్యంగా గత నాలుగున్నరేళ్ళ కాలంలో బీసీలకు పదవులు ఇచ్చారు. కానీ, అధికారం ఎక్కడ అని ఆయన ప్రశ్నించారు. కీలక పదవులన్నీ ఒక సామాజిక వర్గం చేతిలోనే ఉన్నాయని, బీసీలకు నామమాత్రంగా కూడా అధికారాలు ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్సీగానే కాకుండా, వైకాపా బీసీ విభాగం అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఇపుడు ఈయన పార్టీకి వ్యతిరేకంగా గళం వినిపించడం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments