Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా నాన్నను పదవి నుంచి పీకేయ్యండి... దువ్వాడు శ్రీనివాస్ కుమార్తె (Video)

ఠాగూర్
సోమవారం, 12 ఆగస్టు 2024 (14:02 IST)
మా నాన్నను పదవి నుంచి పీకెయ్యండి అంటూ వైకాపా ఎమ్మెల్సీ కుమార్తె దువ్వాడ హైందవి కోరారు. ఈ మేరకు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆమె విజ్ఞప్తి చేశారు. వైకాపా ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్... మాధురితో శారీరక సంబంధం పెట్టుకుని కుటుంబ సభ్యులను దూరంగా ఉంచిన విషయం తెల్సిందే. దీంతో దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆందోళనకు దిగారు. దీంతో వారిపై దాడి చేసేందుకు దువ్వాడ శ్రీనివాస్ ప్రయత్నించారు. 
 
ఈ నేపథ్యంలో తన తండ్రి దువ్వాడ శ్రీనివాస్ గురించి ఆయన పెద్ద కుమార్తె దువ్వాడం హైందవి మీడియాతో మాట్లాడుతూ, మా నాన్న మాపైనే దాడికి ప్రయత్నించాడు. కొట్టేందుకు వచ్చాడు. కాలితో తన్నాడు. పరుష పదజాలంతో దూషించాడు. దీనికి సంబంధించిన వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిని జగన్మోహన్ రెడ్డి కూడా చూసివుంటారు. ఇలాంటి వ్యక్తిని ఇంకా పార్టీలో కొనసాగించడం సిగ్గుచేటు. అందువల్ల ఆయనను ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని కోరుతున్నారు. 
 
పైగా, తామంతా ఇక్కడే ఆందోళన చేస్తామన్నారు. దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి మాకు తండ్రి అని, ఆయన ఉండే ఇల్లుపై తమకు సర్వ హక్కులు ఉన్నాయన్నారు. మాధురి ఎవరో తమకు తెలియదన్నారు. అయితే, ఎంతకాలం ఆందోళన చేస్తారన్నదానిపై ఆమె స్పందిస్తూ, తాము ఎక్కడికి వెళ్లబోమన్నారు. ఇక్కడే ఉంటామని, ఇది మా ఇల్లు అని చెప్పారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శేఖర్ కమ్ముల తో మరో సినిమా చేయనున్నాం : సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు

Niharika: యంగ్ స్టర్స్ తో టైం స్పెండ్ చేస్తుంటా అందుకే హెల్ప్ అవుతుంది : అల్లు అరవింద్

Nikhil Siddhartha: నిఖిల్ సిద్ధార్థ సినిమా సెట్‌లో వరదలు వచ్చాయ్! (video)

కాంతారా-2 షూటింగ్‌లో విషాదం- ముగ్గురు ఆర్టిస్టులు కన్నుమూత

ప్రిజం పబ్‌లో గొడవ : నటి కల్పిక గణేశ్‌పై కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments