జగన్‌కు వైసీపీ ఎమ్మెల్యే షాక్!

Webdunia
శుక్రవారం, 20 డిశెంబరు 2019 (05:41 IST)
3 రాజధానుల ప్రకటనపై జగన్ కు సొంత పార్టీ ఎమ్మెల్యే షాకిచ్చారు. అసెంబ్లీ వేదికగా రాష్ట్రంలో 3 రాజధానులు ఉండొచ్చేమోనని సీఎం జగన్ చేసిన ప్రకటనను అధికార పార్టీ ఎమ్మెల్యే తీవ్రంగా తప్పుపట్టారు.

మూడు రాజధానులపై జగన్ వ్యాఖ్యలను నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆక్షేపించారు. అసెంబ్లీ, పరిపాలన విభాగం ఒకే చోట ఉండాలని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ, సెక్రటేరియట్ రెండూ కూడా ఒక్కచోటే ఉండాలని ఆకాంక్షించారు.

‘ఇది నా అభిమతం.. నా ఆలోచన మాత్రమే’నని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఇదే అభిప్రాయాన్ని సీఎం జగన్‌కు కూడా తెలియజేస్తానని వెల్లడించారు. విశాఖను ఆర్థిక రాజధానికి అభివృద్ధి చేయాలన్నారు. కానీ ఇప్పటికే హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో వచ్చి నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోసారి ప్రజలు నష్టపోవడం భావ్యం కాదని వాపోయారు. నిపుణుల కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత సీఎం సరైన నిర్ణయమే తీసుకుంటారని చెప్పుకొచ్చారు. అప్పటివరకూ ప్రజలు అపోహలు పడవొద్దని సూచించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి చేసిన వ్యాఖ్యలురాజకీయంగా సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

తర్వాతి కథనం
Show comments