Webdunia - Bharat's app for daily news and videos

Install App

2019లో జగనే సీఎం.. రోజా.. అవిశ్వాసానికి మద్దతివ్వాలా? బాబు ప్రశ్న

ప్రత్యేక హోదాను తాను ఇరుకున్న ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు వదిలేసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే హక్కు లేదని ఆ పార్టీ మహిళా నేత, ఎమ్మెల్యే రోజా అన్నార

Webdunia
సోమవారం, 12 మార్చి 2018 (15:08 IST)
ప్రత్యేక హోదాను తాను ఇరుకున్న ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు వదిలేసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే హక్కు లేదని ఆ పార్టీ మహిళా నేత, ఎమ్మెల్యే రోజా అన్నారు. 2019 ఎన్నికల్లో వైకాపా చీఫ్ జగన్‌ గెలుస్తారని.. ఆయన సీఎం కావడం ఖాయమని రోజా వ్యాఖ్యానించారు. 2019లో జగన్ సీఎం కావడం ఖాయమని.. వైకాపా ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రోజా మీడియాతో అన్నారు. 
 
నాలుగేళ్ల పాటు రాష్ట్రానికి హోదా కావాలని జగన్ ఎంతో డిమాండ్ చేస్తున్నారని, నిరాహార దీక్షలు కూడా చేశారని రోజా గుర్తు చేశారు. ప్రస్తుతం చంద్రబాబు కూడా హోదా కావాలని అడుగుతున్నారంటే, అది జగన్ సాధించిన విజయమేనని అభివర్ణించారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ మార్పులను ప్రజలు గమనిస్తున్నారని, రాష్ట్ర ప్రజలను గత మూడున్నరేళ్లుగా మోసపు మాటలతో మభ్యపెట్టిన చంద్రబాబు సర్కారుకు తమ ఓటుతో ప్రజలు బుద్ధి చెప్తారని రోజా జోస్యం చెప్పారు.
 
అంతకుముందు ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. వైకాపా ప్రత్యేక హోదా విషయంలో ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందన్నారు. విశ్వాసం వుందంటూనే.. అవిశ్వాసం పెడతామనడం ఎంతవరకు సబబు అంటూ ప్రశ్నించారు. ఇంకా వైకాపా పెట్టే అవిశ్వాస తీర్మానానికి టీడీపీ మద్దతివ్వాలనడం హాస్యాస్పదమని చంద్రబాబు అన్నారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments