Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీతో పొత్తంటూ... జగన్‌పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది : రోజా

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలుగుదేశం పార్టీతో పాటు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై మరోమారు విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ వైకాపా పొత్తు పెట్టుకుంటుందని టీడీపీ నేతలు దుష్ప్రచ

Webdunia
ఆదివారం, 15 జులై 2018 (17:24 IST)
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలుగుదేశం పార్టీతో పాటు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై మరోమారు విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ వైకాపా పొత్తు పెట్టుకుంటుందని టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు.
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, బీజేపీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయిందని, ఆ పార్టీతో తాము పొత్తు పెట్టుకోనున్నామని జరుగుతున్న ప్రచారం పూర్తివాస్తవ విరుద్ధమన్నారు. తమ పాలన సరిగ్గా లేదు కాబట్టే, తెలుగుదేశం పార్టీ నేతలు ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. 
 
తెలుగుదేశం పార్టీయే బీజేపీతో జతకట్టి అధికారంలోకి వచ్చిందని, అసలు ఆ పార్టీ పొత్తు లేకుండా ఎన్నడూ అధికారంలోకి రాలేదని విమర్శించారు. గతాన్ని ఆ పార్టీ మరచిపోయి లేనిపోని విమర్శలు గుప్పిస్తోందన్నారు. 
 
తమ పార్టీ అధినేత జగన్ కు ధైర్యం ఉంది కాబట్టే 2014 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారని, ఇప్పుడు కూడా అదే చేయబోతున్నారని అన్నారు. జగన్‌పై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని స్పష్టంచేశారు. 

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments