Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిలతో వైకాపా నేతల అర్థనగ్న నృత్యాలు.. ఎక్కడ?

ఠాగూర్
ఆదివారం, 26 మే 2024 (11:19 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా చెలామణి అవుతున్నారు. వీరికి పోలీసులు సైతం వత్తాసు పలుకుతున్నారు. దీంతో వైకాపా నేతలు మరింతగా రెచ్చిపోతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో అనేక మంది వైకాపా నేతలు తిరునాల ఉత్సవం పేరుతో అమ్మాయిలతో అర్థనగ్న డ్యాన్సులు చేస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డారు. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ వారిపై భౌతికదాడులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. 
 
తాజాగా మేకపాటి సోదరుల స్వగ్రామమైన బ్రాహ్మణపల్లిలో వైకాపా నేతలు అమ్మాయిలతో అర్థనగ్న డ్యాన్సులు చేయించడం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ నిబంధనలకు తూట్లుపొడిచి నృత్యాలు చేయించారు. వారు ఎన్ని అరాచకాలు చేసినప్పటికీ చట్టపరంగా సరైన చర్యలు లేకపోవడంతో వారి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల కోడ్ పేరుతో అనేక గ్రామాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న పోలీసులు.. మేకపాటి వంటి బడా వైకాపా నేతల స్వగ్రామాల్లో మాత్రం ఎందుకు అమలు చేయడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ నేతలకు ఒక న్యాయం... మిగిలిన వారందరికీ మరో న్యాయమా అంటూ ప్రశ్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: మూర్తీభవించిన ధర్మాగ్రహం పవన్ కళ్యాణ్; ఐటంసాంగ్ వద్దన్నారు : ఎం.ఎం. కీరవాణి

ఎ.ఆర్. రెహమాన్ లా గాయకులతో హరి హర వీరమల్లు పాటను పాడించిన కీరవాణి

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments