Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసిపి ప్రభుత్వం దేహి అనే దౌర్యాగ్య స్థితికి వచ్చింది: భాజపా ఎమ్మెల్సీ మాధవ్

Webdunia
ఆదివారం, 9 జనవరి 2022 (22:23 IST)
రాష్ట్రప్రభుత్వం మొదటిసారి ఆర్థిక పరిస్థితి బాగోలేదని సిఎం జగన్ కేంద్రాన్ని అడిగారన్నారు బిజెపి రాష్ట్ర కార్యదర్సి, ఎమ్మెల్సీ మాధవ్. పింఛను, జీతాలు ఇవ్వలేని స్థితిలో వైసిపి ప్రభుత్వం దేహి అనే దౌర్యాగ్య స్థితికి వచ్చిందన్నారు. 

 
ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడే విధంగా గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులను నమ్మించి వైసిపి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు బిజెపి అండగా నిలుస్తుందన్నారు. 

 
గ్రామ సచివాలయ ఉద్యోగులకు రావాల్సిన అన్ని బెనిఫిట్స్ ప్రభుత్వం అందించాలన్నారు. విధివిధానాలు లేక గ్రామ సచివాలయ ఉద్యోగులు తల్లడిల్లిపోతున్నారన్నారు. సినిమా ధరలు తగ్గించి ఎవరినో ఇబ్బందులు గురిచేసే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. 

 
నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజల్ ధరలను విపరీతంగా ప్రభుత్వం పెంచేసిందన్నారు. పండుగలు వస్తే విపరీతంగా యాభై శాతం వరకు ఆర్టీసీ ఛార్జీలు పెంచి పేదలపై అధిక భారం మోపుతోందన్నారు. ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలన్నారు.

 
పంజాబ్ లో ప్రధానిని అడ్డుకోవడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ దిక్కులేని పార్టీగా దేశంలో ఉందన్నారు. చంద్రబాబుకు ప్రజల్లో ఆదరణ కరువైందని విమర్సించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సింజిత్.. ఫోన్ ఆఫ్ చేసి ఎక్కడికీ వెళ్లకు బ్రదర్... మహేశ్

Atharva Murali: అథర్వ మురళీ యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్ రాబోతోంది

ఐదు రూపాయల కాయిన్ ఎందుకు బ్యాన్ అయింది అనే కథతో చంద్రహాస్ కాయిన్ చిత్రం

Manoj: మా అమ్మ, అక్క కళ్ళల్లో ఆనందం చూశాను : మంచు మనోజ్

Vijay: టాలెంట్ ఉందోలేదో తెలీదు, ఆ డైరెక్టర్ తో వంద దేవుళ్ళు చేస్తున్నా : విజయ్ ఆంటోనీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

పండుగ కలెక్షన్ మియారాను విడుదల చేసిన తనైరా

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

హైదరాబాద్‌లో సిగ్నేచర్ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్న జోస్ అలుక్కాస్

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments