జగన్ పాలనలో రెడ్లు బాగా నష్టపోయాం.. కానీ : కేతిరెడ్డి (Video)

ఠాగూర్
సోమవారం, 25 నవంబరు 2024 (09:53 IST)
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న వైకాపా ప్రభుత్వ పాలనలో రెడ్డి సామాజిక వర్గం ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. అయితే, ఆయన పాలనలో రెడ్లు తలెత్తుకుని నిలబడేలా చేశారని, ఇది ప్రతి ఒక్క రెడ్డికి గర్వకారణమన్నారు. 
 
అనంతపురం ధర్మవరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరూ అన్ని విధాలుగా నష్టపోయిన మాట నిజమేనన్నారు. ఆర్థికంగా చాలా నష్టం జరిగిందన్నారు. కానీ, ప్రతి ఒక్క రెడ్డి తలెత్తుకుని తిరిగేలా జగన్ చేశారన్నారు. 
 
అలాగే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకం ఎంతో గొప్పదన్నారు. ఈ పథకాల వల్ల కోట్లాది పేద, మధ్యతరగతి ప్రజలు లబ్ధి పొందారన్నారు. ఒక ప్రజాప్రతినిధిగా తాను నిర్వహించిన గుడ్ మార్నింగ్ దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రతి రోజూ ఉదయం కనీసం 10 నుంచి 20 మంది వరకు తన వద్దకు వచ్చి తమ సమస్యలు చెప్పుకునేవారని, ఆ సమస్యలకు పరిష్కారం చూపించడంలో ఒక ఎమ్మెల్యేగా తనకు ఎంతో సంతృప్తి మిగిలిందన్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments