వైసీపీ గుణపాఠం చెప్పే సమయం వచ్చింది: యనమల

Webdunia
ఆదివారం, 8 మార్చి 2020 (14:17 IST)
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. బీసీలకు అన్యాయం చేసేందుకే రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లలేదని మండిపడ్డారు. వైసీపీ దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని, ఆ పార్టీకి గుణపాఠం చెప్పే సమయం వచ్చిందని యనమల అన్నారు. బలహీన వర్గాల ఆశలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ నీళ్లు చల్లారని ఆయన ఆరోపించారు. 
 
బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలను దారుణంగా వంచించారని యనమల విమర్శించారు. బీసీ మహిళలను కూడా రాజకీయాధికారం నుంచి దూరం చేశారని ఆయన మండిపడ్డారు. బీసీలకు అన్యాయం చేసేందుకే రిజర్వేషన్లపై వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లలేదని చెప్పారు.
 
కాగా, స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ అంశాన్ని సవాలు చేస్తూ వైసీపీ సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించలేదంటూ టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments