Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌పై ఎన్ని కేసులున్నా.. ఆయన హీరోగా కనిపించారు.. యామిని సాధినేని

Webdunia
సోమవారం, 27 మే 2019 (11:11 IST)
టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. తండ్రి రాజశేఖర రెడ్డి నుంచి వారసత్వంగా వచ్చిన మాస్ లీడర్ షిప్.. వారికంచూ వున్న ఓటు బ్యాంక్ వాళ్లని గెలిపించాయని చెప్పారు. టీడీపీ ఓటమికి గల కారణాలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన యామిని.. వైఎస్సార్ సెంటిమెంట్, ఓటు బ్యాంక్‌తో జగన్ గెలిచారని.. అందుకే ఎన్నికల ప్రచారం తామెన్ని చెప్పినా వర్కౌట్ కాలేదన్నారు. 
 
జగన్‌పై ఎన్ని కేసులు పడినా ప్రజలు ఆయనలో ఓ నాయకుడిని చూసి ఉంటారు. ప్రజలు ఆయనలో ఓ పాజిటివ్ నెస్‌ను తీసుకున్నట్లు ఈ ఎన్నికల ఫలితాలను బట్టి తెలుసుకోవచ్చునని యామిని అన్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రజలను కోరడం, పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి చొచ్చుకుని పోవడం వైసీపీకి కలిసి వచ్చిందని అభిప్రాయపడ్డారు. ప్రజలు ఇచ్చిన తీర్పునకు తాను వ్యతిరేకంగా మాట్లాడబోనని స్పష్టం చేశారు.
 
ఇంకా ప్రజలకు ఏమి కావాలో, నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఏమేం చర్యలు తీసుకోవాలనే దానిపై మాజీ సీఎం చంద్రబాబు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారని.. టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడా తేడా లేదని ఆమె చెప్పారు. కానీ టీడీపీ తెచ్చిన పథకాలు పూర్తిగా క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరలేదేమోనని అనిపిస్తుందని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments