Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపాలో చేరిన చంద్రబాబు... వర్మపై పోలీసులకు ఫిర్యాదు

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (09:39 IST)
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేసుకున్నారు. చంద్రబాబు టీడీపీని వీడి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపాలో చేరినట్టు ఓ ట్వీట్ చేశారు. దీనికి మార్ఫింగ్ చేసిన ఓ ఫోటోను కూడా పోస్ట్ చేశారు. ఈ ఫోటో వైరల్ కావడంతో వర్మ చిక్కుల్లో పడ్డారు. 
 
ఈ ఫోటోపై టీడీపీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబును అవమానించేలా సోషల్ మీడియాలో వర్మ పెట్టిన పోస్టింగ్‌‌లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ కార్యకర్తలు హైదరాబాద్‌‌లోని బాచుపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన ఫేస్‌‌బుక్‌, ట్విటర్‌ ఖాతాల్లో సీఎంను అవమానపరిచేలా మార్ఫింగ్‌ ఫోటోలను పెట్టారంటూ, ఇదే ప్రాంతానికి చెందిన దేవి వీర వెంకట సత్యనారాయణ చౌదరి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఫిర్యాదును స్వీకరించి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments