Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తకు విడాకులిప్పించి.. పెళ్లి చేసుకున్నాడు.. ఇపుడే వేధిస్తున్నాడు...

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (16:05 IST)
కట్టుకున్న భర్తకు విడాకులు ఇప్పించి తనను పెళ్లి చేసుకున్నాడనీ, ఇపుడు వదలించుకునేందుకు వేధిస్తున్నాడంటూ ఓ ఎస్ఐపై మహిళ ఫిర్యాదు చేసింది. ఈ ఘటన గుంటూరు జిల్లా ముప్పాళ్ళలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు జిల్లా ముప్పాళ్ళకు చెందిన ఓ మహిళ తన భర్తతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ముప్పాళ్ళ పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. అపుడు ఎస్.ఐ జగదీష్ తనకు న్యాయం చేస్తానని మొబైల్ నంబరు తీసుకున్నాడు. ఆ తర్వాత తనను ఇంటికి పిలిచి బలవంతంగా లొంగ దీసుకుని అత్యాచారం జరిపాడని పేర్కొంది. 
 
అప్పటి నుంచి బెదిరిస్తూ అత్యాచారం చేస్తూ వచ్చాడని పేర్కొంది. ఆ తర్వాత... తన భర్తకు విడాకులిప్పించి, తనను  వివాహం చేసుకున్నాడని తెలిపారు. అయితే ఇపుడు తనను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. తనకు ఆ ఎస్‌ఐతో  ప్రాణహాని ఉందని ఆందొళన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని ఆ మహిళ వేడుకున్నారు. ఈ మేరకు ఆమె నరసారావు పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments