Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ‌లో సెల్ ట‌వ‌ర్ ఎక్కి క‌ల‌క‌లం సృష్టించిన మ‌హిళ‌..!

విశాఖ కలెక్టరేట్ వద్ద ల‌క్ష్మి అనే మహిళ సెల్ టవర్ ఎక్కి కలకలం రేపింది. దీంతో అధికారులు, పోలీసులు ఉరుకులూ పరుగులు పెట్టారు. మల్కాపురం ప్రాంతానికి చెందిన లక్ష్మి భర్త కొన్నేళ్ల కిందట మరణించాడు. అప్ప‌టి నుంచి ఇద్దరు కూతుళ్లను తానే పెంచి పోషిస్తోంది. తనక

Webdunia
సోమవారం, 6 ఆగస్టు 2018 (22:12 IST)
విశాఖ కలెక్టరేట్ వద్ద ల‌క్ష్మి అనే మహిళ సెల్ టవర్ ఎక్కి కలకలం రేపింది. దీంతో అధికారులు, పోలీసులు ఉరుకులూ పరుగులు పెట్టారు. మల్కాపురం ప్రాంతానికి చెందిన లక్ష్మి భర్త కొన్నేళ్ల కిందట మరణించాడు. అప్ప‌టి నుంచి ఇద్దరు కూతుళ్లను తానే పెంచి పోషిస్తోంది. తనకు చెందిన స్థలాన్ని ఓ రిటైర్డ్ పోలీస్ కానిస్టేబుల్ ఆక్రమించారని ఆమె ఆరోపిస్తోంది. అతడి పై చర్యలు తీసుకొమ్మంటూ అధికారులకు ఫిర్యాదు చేయగా.. ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తోంది. 
 
తనకు పిల్లల పోషణ భారమైందని, ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం లభించడంలేదని... అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగానని, అయినా తనకు న్యాయం జరగడంలేదని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేసింది. చివరికి కలెక్టరేట్‌ను ఆశ్రయిస్తే.. కలెక్టర్‌ను కలవనీయకుండా అధికారులు అడ్డుపడుతున్నారని చెప్పింది. తనకు న్యాయం చేయకపోతే అక్కడ నుంచి దూకేస్తానని బెదిరించింది. పోలీసులు ఆమెను సురక్షితంగా కిందకి తీసుకొచ్చారు. అనంతరం ప్రభుత్వ పరంగా సాయం చేస్తామని, భూ ఆక్రమణ విషయమై దర్యాప్తు చేయిస్తామని కలెక్టర్ ఆమెకు హామీ ఇచ్చారు. అదీ సంగ‌తి..!

సంబంధిత వార్తలు

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments