Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్‌పై పరువు నష్టం దావా... హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వాలంటీర్

Webdunia
సోమవారం, 24 జులై 2023 (16:30 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై ఓ పరువు నష్టం దావా కేసు నమోదైంది. ఓ మహిళా వాలంటీర్ ఈ క్రిమినల్ డిఫమేషన్ కేసును వేశారు. వాలంటీర్ వ్యవస్థ గురించి, వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తమను మానసికంగా వేధించారంటూ విజయవాడకు చెందిన వాలంటీర్ స్థానిక సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. 
 
ఈ సందర్భంగా మహిళా వాలంటీర్ మాట్లాడుతూ, తన పరువుకు భంగం కలిగిందంటూ ఈ పరువు నష్టం దావా వేసినట్టు చెప్పారు. వాలంటీర్లుగా తాము మహిళల డేటాను సేకరించామని, డేటా చోరీ చేశామని పవన్ కళ్యాణ్ ఆరోపించారని, ఈ వ్యాఖ్యలతో తమ మనోభావాలతో దెబ్బతిన్నాయని వాపోయారు. ఉమెన్ ట్రాఫికింగ్ అంటూ తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. సేవ చేస్తున్న తమపై నిందలు వేసిన పవన్ కళ్యాణ్‌పై చట్టపరంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రస్తుతానికి తాను ఒక్కరినే ఈ తరహా పిటిషన్‌ను దాఖలు చేశానని, మున్ముందు తనను చూసి మరింకొందరు దాఖలు చేస్తారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments