Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్‌పై పరువు నష్టం దావా... హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వాలంటీర్

Webdunia
సోమవారం, 24 జులై 2023 (16:30 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై ఓ పరువు నష్టం దావా కేసు నమోదైంది. ఓ మహిళా వాలంటీర్ ఈ క్రిమినల్ డిఫమేషన్ కేసును వేశారు. వాలంటీర్ వ్యవస్థ గురించి, వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తమను మానసికంగా వేధించారంటూ విజయవాడకు చెందిన వాలంటీర్ స్థానిక సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. 
 
ఈ సందర్భంగా మహిళా వాలంటీర్ మాట్లాడుతూ, తన పరువుకు భంగం కలిగిందంటూ ఈ పరువు నష్టం దావా వేసినట్టు చెప్పారు. వాలంటీర్లుగా తాము మహిళల డేటాను సేకరించామని, డేటా చోరీ చేశామని పవన్ కళ్యాణ్ ఆరోపించారని, ఈ వ్యాఖ్యలతో తమ మనోభావాలతో దెబ్బతిన్నాయని వాపోయారు. ఉమెన్ ట్రాఫికింగ్ అంటూ తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. సేవ చేస్తున్న తమపై నిందలు వేసిన పవన్ కళ్యాణ్‌పై చట్టపరంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రస్తుతానికి తాను ఒక్కరినే ఈ తరహా పిటిషన్‌ను దాఖలు చేశానని, మున్ముందు తనను చూసి మరింకొందరు దాఖలు చేస్తారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments