Webdunia - Bharat's app for daily news and videos

Install App

బౌద్ధారామాలకు వెళ్లిన ఆ జంట.. చాలాసేపటికి తిరిగి రాలేదు.. వెళ్ళి చూస్తే?

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (15:31 IST)
బౌద్ధరామాలకు పర్యటనకు వెళ్లిన ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమెతోపాటు వచ్చిన యువకుడు తీవ్రగాయాలతో అక్కడే పడి ఉండటం గమనించిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలను పరిశీలిస్తే, ఎల్లప్పుడూ రద్దీగా ఉండే పర్యాటక స్థావరం గుంటుపల్లి బౌద్ధారామాలను ఆదివారం మధ్యాహ్నం 40 మంది పాఠశాల విద్యార్థులు సందర్శించారు.

వారితోపాటు మరో మూడు జంటలు కొండపైకి వెళ్లినట్లు సిబ్బంది చెప్పారు. కొంతసేపటికి విద్యార్థులు, రెండు జంటలు తిరిగి వచ్చేశారు. కానీ ఒక జంట మాత్రం చాలాసేపు రాకపోవడంతో సిబ్బంది వెతకడానికి వెళ్లారు. అక్కడ ఓ యువతి బట్టలు లేకుండా అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉంది. 
 
తీవ్ర గాయాలై రక్తం చెట్లకు కూడా అంటుకుని ఉంది. ఆమెతోపాటు యువకుడు కూడా ప్రక్కనే తీవ్ర గాయాలతో పడి ఉన్నాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించి ఆమెపై అత్యాచారం చేసి ఈ దుర్ఘటనకు పాల్పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేసారు.

యువకుడు నవీన్‌ భీమడోలు మండలం అజ్జావారిగూడేనికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. మృతదేహం వద్ద యువకుడు గాయాలతో పడి ఉండటం పలు అనుమానాలకు దారితీస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

ఫ్యామిలీ విందులో పవన్ కళ్యాణ్ పాట పాడిన విజయ్ దేవరకొండ

హ్రుతిక్ రోషన్ ఎంత పనిచేశాడు - నీల్ సినిమా అప్ డేట్ బ్రేక్ పడింది

Nayanthara: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి చిత్రంలో నయనతార ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

తర్వాతి కథనం
Show comments