Webdunia - Bharat's app for daily news and videos

Install App

బౌద్ధారామాలకు వెళ్లిన ఆ జంట.. చాలాసేపటికి తిరిగి రాలేదు.. వెళ్ళి చూస్తే?

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (15:31 IST)
బౌద్ధరామాలకు పర్యటనకు వెళ్లిన ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమెతోపాటు వచ్చిన యువకుడు తీవ్రగాయాలతో అక్కడే పడి ఉండటం గమనించిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలను పరిశీలిస్తే, ఎల్లప్పుడూ రద్దీగా ఉండే పర్యాటక స్థావరం గుంటుపల్లి బౌద్ధారామాలను ఆదివారం మధ్యాహ్నం 40 మంది పాఠశాల విద్యార్థులు సందర్శించారు.

వారితోపాటు మరో మూడు జంటలు కొండపైకి వెళ్లినట్లు సిబ్బంది చెప్పారు. కొంతసేపటికి విద్యార్థులు, రెండు జంటలు తిరిగి వచ్చేశారు. కానీ ఒక జంట మాత్రం చాలాసేపు రాకపోవడంతో సిబ్బంది వెతకడానికి వెళ్లారు. అక్కడ ఓ యువతి బట్టలు లేకుండా అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉంది. 
 
తీవ్ర గాయాలై రక్తం చెట్లకు కూడా అంటుకుని ఉంది. ఆమెతోపాటు యువకుడు కూడా ప్రక్కనే తీవ్ర గాయాలతో పడి ఉన్నాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించి ఆమెపై అత్యాచారం చేసి ఈ దుర్ఘటనకు పాల్పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేసారు.

యువకుడు నవీన్‌ భీమడోలు మండలం అజ్జావారిగూడేనికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. మృతదేహం వద్ద యువకుడు గాయాలతో పడి ఉండటం పలు అనుమానాలకు దారితీస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments