Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధం.. వద్దమ్మా అన్నాడు.. అంతే కన్నకొడుకునే చంపేసింది..

వివాహేతర సంబంధాలు.. వాటి ద్వారా జరిగే నేరాలు అధికమవుతున్నాయి. అక్రమ సంబంధాల కారణంగా హత్యలు పెరిగిపోతున్నాయి. తాజాగా వివాహేతర సంబంధానికి అడ్డు చెప్తున్నాడనే కారణంగా కన్నకొడుకునే కర్కశ తల్లి హత్య చేసింద

Webdunia
బుధవారం, 22 ఆగస్టు 2018 (15:25 IST)
వివాహేతర సంబంధాలు.. వాటి ద్వారా జరిగే నేరాలు అధికమవుతున్నాయి. అక్రమ సంబంధాల కారణంగా హత్యలు పెరిగిపోతున్నాయి. తాజాగా వివాహేతర సంబంధానికి అడ్డు చెప్తున్నాడనే కారణంగా కన్నకొడుకునే కర్కశ తల్లి హత్య చేసింది. 
 
ఈ ఘటన విజయనగరం జిల్లా కేంద్రంలోని గాయత్రీనగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లాకు చెందిన ఓ వివాహిత 17 ఏళ్ల క్రితం భర్తతో విడిపోయింది. భర్తతో విడిపోయిన తర్వాత ఆమె కొంత కాలంగా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. 
 
ఈ వ్యవహారంపై ఆమె కుమారుడు హరిభగవాన్‌ గొడవకు దిగేవాడు. దీంతో తల్లీకుమారుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో హరి భగవాన్ తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఆ తల్లి భావించింది. భోజనంలో నిద్రమాత్రలను కలిపి హరిభగవాన్‌కు ఇచ్చింది. భోజనం తిన్న తర్వాత హరిభగవాన్ మత్తులోకి జారుకొన్నాడు. ఆపై చున్నీతో అతడి గొంతు బిగించి హత్య చేసింది. 
 
ఈ విషయమై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో కుమారుడిని హత్యచేసినట్లు ఒప్పేసుకుంది. అయితే హరిభగవాన్ హత్యలో ప్రియుడి ప్రమేయం కూడ ఉందా లేదా అనే కోణంలో విచారణ జరుగుతోంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments