Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెయిర్ డై కలిపిన డికాషన్ తాగిన మహిళ....

Webdunia
శుక్రవారం, 16 నవంబరు 2018 (09:29 IST)
హైదరాబాద్ నగరంలో ఓ మహిళ పొరపాటున హెయిర్ డై కలిపిన డికాషన్ తాగడంతో ప్రాణాలు కోల్పోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, చప్పల్ బజార్‌కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి భార్య సంధ్య (24). గృహిణిగా ఇంట్లోనే ఉంటూ పిల్లల ఆలనాపాలనా చూస్తోంది. 
 
ఈ క్రమంలో బుధవారం రాత్రి టీ పెట్టుకునేందుకు స్టౌపై డికాషన్ పెట్టింది. వంటగది సమీపంలోనే హెయిర్ డై డబ్బు పెట్టింది. అది తెలియని ఆమె మూడేళ్ళ కుమారుడు.. ఆ హెయిర్ డైను స్టౌపై కాగుతున్న డికాషన్‌లో పోశాడు. 
 
ఈ విషయం తెలియని సంధ్య... ఆ డికాషన్‌ను తాగింది. తాగిన కొద్దిసేపటికి ఆమె అపస్మారక స్థితిలోకి జారుకుంది. దీంతో ఆమెను హుటాహుటిని ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ గురువారం కన్నుమూసింది. కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments