నందమూరి హరికృష్ణ తనయకు కూకట్‌పల్లి సీటు.. 17న నామినేషన్

Webdunia
శుక్రవారం, 16 నవంబరు 2018 (09:16 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని పోటీ చేయనున్నారు. ఈమెకు కూకట్‌పల్లి టిక్కెట్‌ను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేటాయించారు. 
 
నిజానికి ఈ స్థానం నుంచి సుహాసిని పోటీ చేసే అంశంపై రెండు రోజుల పాటు తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఈనేపథ్యంలో గురువారం చంద్రబాబును వైజాగ్‌లో కలుసుకున్నారు. ఆ తర్వాత ఆమెకు టిక్కెట్ ఖరారు చేశారు. సుహాసిని విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలంటూ ఆ సెగ్మెంట్‌కు చెందిన టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారు. దీంతో శనివారం ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు. 
 
కాగా, హరికృష్ణ కుమార్తె సుహాసిని తూర్పుగోదావరి జిల్లా మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి కుమారుడు శ్రీకాంత్ సతీమణి. పిల్లల చదువుల కోసం సుహాసిని హైదరాబాద్ నగరంలో కొన్నేళ్లుగా స్థిరపడిపోయారు. హరికృష్ణ ఆకస్మిక మరణం తర్వాత ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలన్న ఉద్దేశ్యంతోనే చంద్రబాబు ఆమెకు పార్టీ టిక్కెట్ కేటాయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments