కొడుకుతో బైక్‌పై వెళ్తున్న మహిళ.. లారీ టైర్ కింద పడి రెండు ముక్కలు

Webdunia
సోమవారం, 11 ఏప్రియల్ 2022 (12:11 IST)
ఉమ్మడి మెదక్ జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. 
 
వివరాల్లోకి వెళ్లితే.. జగదేవపూర్ మండలం గణేష్ పల్లి గ్రామానికి చెందిన గడియరం పద్మ తన కుమారుడితో కలిసి బైక్‌పై సోమవారం ఉదయం సిద్దిపేట నుండి గణేష్ పల్లికి వెళుతుంది. 
 
ఈ క్రమంలో కుకునూర్ పల్లి ఇండియన్ పెట్రోల్ బంక్ వద్దకు రాగానే సిద్దిపేట నుంచి వస్తున్న లారీ స్పీడ్ కంట్రోల్ తప్పి ముందు వెళ్తున్న బైక్‌ను వెనుక నుంచి ఢీ కొట్టింది. 
 
దీంతో బైక్‌పై ఉన్న మహిళ లారీ టైర్ కింద పడి రెండు ముక్కలై అక్కడికక్కడే మృతి చెందగా, కొడుకు సందీప్‌కు తీవ్రగాయాలయ్యాయి.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

తర్వాతి కథనం
Show comments