Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడపిల్ల పుట్టిందనే అక్కసుతో కరెంట్ షాక్ ఇచ్చిన శాడిస్టు భర్త

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (17:09 IST)
ఆధునికత మారినా.. అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నా.. ఆడపిల్లలపై చిన్నచూపు చూసేవారు ఏమాత్రం మారట్లేదు. ఆడపిల్లలు వద్దనుకుంటున్న జనం ఇంకా వున్నారు. అలాగే ఆడపిల్ల పుడితే ఈసడించుకునే వారు కూడా వున్నారు. 
 
అయితే తాజాగా ఓ కిరాతకుడు ఆడపిల్ల పుట్టిందనే అక్కసుతో భార్యకు కరెంటు షాక్‌ ఇచ్చి మరీ హింసించాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా పెనమలూరులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. పెనమలూరుకు చెందిన శీలం రాజారత్నం, ప్రశాంతిలు ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ఇద్దరివి వేర్వేరు కులాలు కావడంతో పెద్దలు అంగీకరించలేదు. దీంతో 2014లో వివాహం చేసుకున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసే రాజారత్నం పెళ్లైన కొద్దిరోజుల నుంచి ప్రశాంతిని వేధించడం మొదలుపెట్టాడు. 
 
అనుమానంతో ఆమెను వేధింపులకు గురిచేసేవాడు. రాజారత్నం తండ్రి కూడా ఈ వికృతచర్యలకు వంత పాడేవాడు. ఇటీవలేలో తల్లిదండ్రుల నుంచి విడిపోయి కానూరులో వేరే కాపురం పెట్టారు. వీరికి తొలిసారి మగపిల్లాడు జన్మించాడు.
 
రెండో కాన్పులో ప్రశాంతి జనవరి 28న ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో ఆడపిల్లను కన్నావని, కట్నం తీసుకురావాలని, లేకపోతే పుట్టింటికి వెళ్లిపోమని వేధింపులను మరింత తీవ్రతరం చేశాడు. 
 
ఈ క్రమంలోనే ఫిబ్రవరి 1 రాత్రి ప్రశాంతి నిద్రిస్తున్న సమయంలో ఆమె చేతికి విద్యుత్ తీగచుట్టి స్విచ్‌ వేశాడు. దీంతో ప్రశాంతి విద్యుదాఘాతానికి గురై పెద్దగా కేకలు వేసింది. 
 
ఆమె అరుపులకు పక్కగదిలో ఉన్న ప్రశాంతి తల్లి వచ్చిచూడగా విద్యుత్తు వైర్లు కనిపించాయి. అప్పటికే రాజారత్నం పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త, మామలపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments