Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడిని పెళ్లాడిందనీ విహహితను గొంతుకోసి చంపేశారు...

తన ప్రియుడిని మరిచిపోలేని ఓ ప్రియురాలు... అతని భార్యను గొంతుకోసి హత్య చేసింది. ఈ దారుణం నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఓడూరు గ్రామంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... మండలంలోని తీపనూరు గ్రామానికి

Webdunia
శనివారం, 25 నవంబరు 2017 (11:24 IST)
తన ప్రియుడిని మరిచిపోలేని ఓ ప్రియురాలు... అతని భార్యను గొంతుకోసి హత్య చేసింది. ఈ దారుణం నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఓడూరు గ్రామంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... మండలంలోని తీపనూరు గ్రామానికి చెందిన కాటూరు అశోక్‌ అనే వ్యక్తితో ఓడూరుకు చెందిన షర్వాణీ (28) అనే యువకితి యేడాదిన్నర క్రితం వివాహమైంది. షర్వాణీ ఓడూరు రైల్వేస్టేషన్‌లో గ్యాంగ్‌ ఉమన్‌గా పని చేస్తుండగా, అశోక్ గూడురులోని ఓ కంపెనలో పని చేస్తున్నాడు. 
 
అయితే, అశోక్‌‌కు పెళ్లికాకముందే వింజమూరుకు చెందిన మౌనికతో పరిచయం ఉంది. అశోక్‌కు షర్వాణీతో వివాహం జరగడాన్ని ఆమె జీర్ణించుకోలేక పోయింది. ఎలాగైనా ఆమెను అతనికి దూరం చేసి, తాను దగ్గర కావాలని మౌనిక ప్రయత్నిస్తూనే ఉంది. అవేమీ ఫలించక పోవడంతో షర్వాణీని హతమార్చాలని ప్లాన్ వేసింది. 
 
ఈ క్రమంలో షర్వాణీ రెండు రోజుల క్రితం డ్యూటీ ముగించుకుని ఓడూరులోనే ఉన్న తన తల్లి ఇంటికి వెళ్లింది. ఆమె వెళ్లిన కొద్దిసేపటికి అశోక్ తమ్ముడు కూడా ఆ ఇంటికి వెళ్ళగా, తలుపులు వేసివున్నాయి. దీంతో ఎంత పిలిచినా తలుపు తీయకపోవడంతో కిటికీలోనుంచి చూడగా షర్వాణీ రక్తపుమడుగులో పడివుండటం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. 
 
అవేవీ ఫలించకపోవడంతో షర్వాణీ హత్యకు పథకం రచించింది. శుక్రవారం మధ్యాహ్నం ఓడూరులోని తన తల్లి వద్దకు షర్వాణీ వెళ్లింది. ఆ తర్వాత కొద్దిసేపటికే షర్వాణీ మరిది సంతోశ్‌ అక్కడకు వచ్చాడు. ఇంటికి తాళం వేసి ఉండటంతో కిటికిలోంచి చూడగా రక్తపు మడుగులో షర్వాణీ పడివుంది. అతడు చూసేటప్పటికే ఆమె ప్రాణాలు పోయాయి. 
 
వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇందులోభాగంగా భర్త అశోక్‌ను ప్రశ్నించగా, తనకు గతంలో మౌనిక అనే యువతితో పరిచయం ఉందని, ఆమె తన తల్లి పద్మావతితో కలిసి హత్య చేసి ఉంటుందని అనుమానం వ్యక్తంచేశాడు. వారిద్దరిని వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments