Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో నిద్రిస్తున్న వివాహితను కిడ్నాప్ చేసి.. పత్తిచేనులోకి తీసుకెళ్లి..?

Webdunia
ఆదివారం, 26 జనవరి 2020 (11:44 IST)
దేశంలో మహిళలపై అకృత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. మహిళలపై చెయ్యేసేందుకు కూడా భయపడేలా కఠినమైన చట్టాలు వస్తే తప్ప.. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయడం కుదరదు. వయోబేధం లేకుండా అత్యాచారాలు జరుగుతున్న వేళ.. ఇంట్లో నిద్రిస్తున్న మహిళను కూడా కామాంధులు వదిలిపెట్టలేదు. ఇంట్లో నిద్రిస్తున్న ఓ వివాహితను కిడ్నాప్ చేసిన కామపిశాచులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాయి. 
 
ఈ దుర్ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న 35 ఏళ్ల‌ వివాహిత‌ను కిడ్నాప్ చేసి బైక్‌పై తీసుకెళ్లిన యువకులు స‌మీప‌ పత్తిచేనులోకి తీసుకెళ్లి మరికొందరితో కలిసి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
బాధితురాలిని కిడ్నాప్ చేస్తున్నప్పుడు చ‌ప్పుడు రావడంతో మేల్కొన్న పొరుగింటి యువతి వారిని రహస్యంగా అనుసరించడంతో ఈ ఘటన పోలీసులకు తెలియవచ్చింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోపే నిందితులు అక్కడ నుంచి పారిపోయారు. 
 
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే నిందితులను అరెస్ట్ చేయాలంటూ స్థానికులు, బంధువులు రఘునాథపాలెం పీఎస్ ఎదుట ఆందోళనకు దిగారు. కాగా, నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాలో ఉన్న అహంకారం రాలి పడింది : కోట శ్రీనివాస్ జ్ఞాపకాలు

డాకు మహారాజ్ నుంచి సుక్క నీరు లిరిక్ విడుదలచేశారు

సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ కు మరింత వినోదం వుండేలా డిజైన్ చేస్తా : అనిల్ రావిపూడి

కెరీర్ లో యాక్షన్ టచ్ తో కామెడీ ఫిల్మ్ లైలా: విశ్వక్సేన్

తమ్ముడితో సెటిల్ చేస్తా.. మరి నాకేంటి అని అన్నయ్య అడిగారు? శ్రీసుధ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

తర్వాతి కథనం