పక్కా ప్లాన్‌తోనే దాడి చేశారు : ఈటల రాజేందర్

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2022 (17:50 IST)
తన కాన్వాయ్‌పై పక్కా ప్లాన్‌తోనే దాడి చేశారని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెరాస నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి, పెద్ది సుదర్శన్ సమక్షంలోనే తెరాస కార్యకర్తలు తన కాన్వాయ్‌పై దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఈ దాడికి పోలీసులే నైతిక బాధ్యత వహించాలని ఆయన కోరారు. అదేసమయంలో మునుగోడు ఉపఎన్నికల్లో తెరాస నేతల చెంపలు ఛెళ్లుమనిపించేలా ప్రజలు తీర్పునివ్వాలని ఈటల పిలుపునిచ్చారు. 
 
ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై తెరాస శ్రేణులు దాడికి పాల్పడ్డారు. దీనిపై ఈటల రాజేందర్ స్పందిస్తూ, పలివెలలో తెరాసకు క్యాడర్ కూడా లేదని ఇలాంటి చోట పోలీసులను కూడా లెక్క చేయకుండా వాళ్లు దాడులు చేయడాన్ని అందరూ గమనించాలని చెప్పారు. తమను ఎదుర్కోలేకే ఇలా భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. 
 
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారం చేసే సమయంలో కూడా ఇలాగే వ్యవహరించారని ఈటల మండిపడ్డారు. ఇలాంటి చిల్లర వేషాలు తెరాసకు కొత్తేమీ కాదని విమర్శించారు. పలివెలలో పక్కా ప్లాన్‌‍తోనే తన కాన్వాయ్‌పై దాడి చేశారన్నారు. తెరాస కార్యకర్తలు చేసిన దాడిలో 15 ప్రచార రథాలు, వాహనాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments