Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రమాణం పూర్తయ్యాక సీఎం జగన్ గారిని విష్ చేసి రండి... జనసేన ఎమ్మెల్యేతో పవన్?

Webdunia
బుధవారం, 12 జూన్ 2019 (14:04 IST)
ఆంధ్రప్రదేశ్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో సహా అంతా ప్రమాణ స్వీకారం చేశారు. వీరందరితో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించారు. సభ్యులంతా ప్రమాణం చేసిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన ఛాంబర్‌కి వెళ్లారు. ఆ తర్వాత కొందరు సభ్యులు వెళ్లి ఆయనను విష్ చేసి వచ్చారు.
 
వీరిలో జనసేన పార్టీ రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా వున్నారు. ఆయన జగన్‌ మోహన్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపి వచ్చారు. ఐతే జనసేన నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యే కావడంతో ఆయన ఎక్కడికి వెళ్లినా వార్తల్లోకి వచ్చేస్తుంది. మీరు జగన్ మోహన్ రెడ్డిని ఎందుకు కలిశారంటూ ఆయనను విలేకరులు ప్రశ్నించారు. 
 
తను ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసినట్లు చెప్పారు రాపాక. కాగా రాపాకకు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఓ మాట చెప్పారట. అదేంటయా అంటే... ప్రమాణ స్వీకారం పూర్తవ్వగానే మన పార్టీ తరపున ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు చెప్పి రండి అని అన్నారట. ఆ ప్రకారం రాపాక సీఎంను కలిసి విషెస్ చెప్పి వచ్చారని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

Bobby Kolli: డైరెక్టర్ బాబీ కొల్లి KVN ప్రొడక్షన్స్‌తో సినిమా ప్రకటన

దేవరకొండ కోసం నల్లగండ్ల అపర్ణా సినిమాస్‌లో రాజమౌళి ప్రత్యక్షం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments