Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోజాకు జగన్ పిలుపు... ఆమెకు ఏ ప‌ద‌వి ఇవ్వ‌నున్నారు..?

Advertiesment
AP CM
, మంగళవారం, 11 జూన్ 2019 (13:38 IST)
జ‌గ‌న్ సీఎం కాగానే మంత్రి ప‌ద‌వి ఖాయం అనుకున్న వారిలో రోజా ఒక‌రు. అయితే... ఊహించ‌ని విధంగా జ‌గ‌న్ మంత్రి వ‌ర్గంలో రోజాకు ఛాన్స్ రాలేదు. కార‌ణం ఏంటా అని అంద‌రూ షాక్ అయ్యారు. అయితే... రోజాకు జ‌గ‌న్ స్పీక‌ర్ ప‌ద‌వి ఇవ్వాల‌నుకున్నార‌ని.. ఆ ప‌ద‌విపై రోజా విముఖ‌త చూపించ‌డంతో జ‌గ‌న్ సీరియ‌స్ అయ్యారని.. అందుకే రోజాకు ఏ ప‌ద‌వి ఇవ్వ‌లేద‌ని ప్ర‌చారం జ‌రిగింది. 
 
లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... జగన్ మోహన్ రెడ్డితో భేటీకి రోజా అమరావతి బయలుదేరారట‌. కేబినెట్‌లో చోటు దొరక్కపోవడంతో బాగా ఫీలైంద‌ట‌. అయితే... రోజాకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి ఇవ్వాలని జగన్ ఆలోచనట‌. ఆ పదవి తీసుకోడానికి కూడా రోజా విముఖత చూపిస్తుంద‌ట‌. దీంతో రోజాను జ‌గ‌న్ బుజ్జగిస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఏ ప‌ద‌వి ఆమెకు ఇవ్వ‌నున్నారు అనేది సాయంత్రానికి స్పష్టత రానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్నుగీటి లవ్‌లో పడ్డానంది... నమ్మేసి లక్షలిచ్చాడు... మరొకడిని పెళ్లాడేసరికి...