Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీని మళ్లీ గెలిపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: చంద్రబాబు

Webdunia
మంగళవారం, 14 జనవరి 2020 (18:58 IST)
మూడు రాజధానుల రెఫరెండంతో ఎన్నికలు వెళ్లాలని టీడీపీ నేత చంద్రబాబు డిమాండ్​ చేశారు. ప్రభుత్వం రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలన్నారు. ప్రజలు మళ్లీ వైసీపీనే సమర్థిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్​ చేశారు.

విజయవాడ బెంజ్​సర్కిల్​లో అమరావతి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో భోగి మంటలు వేశారు. . జి.ఎన్‌.రావు కమిటీ, బోస్టన్‌ నివేదిక ప్రతులు భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. ప్రపంచంలో తెలుగువాళ్లు ఎక్కడున్నా భాష, సంస్కృతిని మర్చిపోవడం లేదని చంద్రబాబు అన్నారు. అమరావతికి ఘన చరిత్ర ఉందన్నారు.

వేల సంవత్సరాల క్రితమే రాజ్యంగా ఉన్న.. అమరావతి చారిత్రక ప్రాధాన్యత కాపాడుకోవాలని సూచించారు. విజయవాడలో అమరావతి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన భోగి మంటల కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. జి.ఎన్‌.రావు కమిటీ, బోస్టన్‌ నివేదిక ప్రతులు భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు.

పరిపాలనకు అవసరమైన అన్ని భవనాలు ఇప్పటికే నిర్మించుకున్నామని.. ఒక్కపైసా అవసరం లేకుండా రాజధానిని కొనసాగించుకోవచ్చని చంద్రబాబు అన్నారు. జీఎన్‌రావు కమిటీ నివేదికను భోగి మంటల్లో వేసి పీడ వదిలించుకుంటున్నామన్నారు. మూడు రాజధానులపై రెఫరెండం పెట్టాలని చంద్రబాబు డిమాండ్​ చేశారు.

ప్రభుత్వం రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలన్నారు. ప్రజలు మళ్లీ వైసీపీనే సమర్థిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్​ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments