కేసు తొలగించకుంటే రాజీనామా చేస్తా: వైసీపీ ఎమ్మెల్యే

Webdunia
ఆదివారం, 12 ఏప్రియల్ 2020 (06:05 IST)
తమపై పెట్టిన కేసులను ఎత్తివేయకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకొంటానని కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి హెచ్చరించారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎమ్మెల్యే సహా ఏడుగురిపై నెల్లూరు జిల్లా పోలీసులు కేసులు నమోదు చేశారు.

దీంతో.. తన పైనే కేసు నమోదు చేస్తారా అంటూ దాదాపు 3 గంటల పాటు పోలీస్టేషన్‌ ముందు ప్రసన్నకుమార్ రెడ్డి బైఠాయించారు. తమపై పెట్టిన కేసులు ఎత్తివేయాలన్నారు. తాను పిలిస్తే వచ్చిన పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకున్నా రాజకీయాల నుంచి తప్పుకొంటానని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీపై ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శలు చేశారు. చివరకు కలెక్టర్ ఫోన్ చేసి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆయన నిరసన విరమించారు. నిన్న బుచ్చిరెడ్డిపాలెంలో నిర్వహించిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యాక్రమానికి వందల మంది హాజరయ్యారు.

ఎవ్వరూ భౌతిక దూరం పాటించకుండా వరుసలో నిల్చున్నారనే కారణంతో ఎమ్మెల్యే సహా ఏడుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంపైనే ప్రసన్నకుమార్ రెడ్డి ఆగ్రహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కార్తి చిత్రం వా వాత్తియార్‌ రిలీజ్‌కు చిక్కులు - మద్రాస్ హైకోర్టు బ్రేక్

సెట్‌లోనే నటిస్తూనే చనిపోవాలన్నదే కోరిక - జిమ్‌లో దుస్తులపై ట్రోల్స్ చేశారు : నటి ప్రగతి

Riya Singha: జెట్లీ నుంచి మిస్ యూనివర్స్ రియా సింఘా ఫస్ట్ లుక్ రిలీజ్

జై బాలయ్య అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్న సఃకుటుంబానాం

Jin: వైవిధ్యభరితమైన కథతో సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ జిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments