Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంకెంత మంది ముస్లింలను బలిగొంటారు?:లోకేష్

Muslims
Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (23:22 IST)
కొంతమంది పోలీసులు పులివెందుల ఫ్యాక్షన్ ముఠా సభ్యుల్లా వ్యవహరిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ రెడ్డి కోసం ఇంకెంత మంది ముస్లిం మైనారిటీలను బలిగొంటారని ప్రశ్నించారు.

సీఎం బంధువు తిరుపాల్ రెడ్డి.. అక్బర్ బాషా భూమి కబ్జా చేస్తే.. బాషాని సీఐ ఎన్ కౌంటర్ చేస్తామనడం... కుటుంబమంతా సామూహిక ఆత్మహత్యాయత్నం చేస్తే కిడ్నాప్ చేయడం.. పోలీసుల విధులా? అని నిలదీశారు. అక్బర్ బాషా భూమి తిరిగిచ్చేశామని, వివాదం సమసిపోయిందని నమ్మించిన జగన్ రెడ్డి బృందం.. ‘దిక్కున్నచోట చెప్పుకో.. నీ భూమి ఇచ్చేది లేదని తేల్చేయడంతో బాషా కుటుంబంతో సహా మళ్లీ ఆత్మహత్య ప్రయత్నం చేసిందని’ అన్నారు.

అక్బర్ కుటుంబంలో ఏ ఒక్కరి ప్రాణాలకి ప్రమాదం ఏర్పడినా సీఎం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సీఎం బంధువుల కబ్జాలకు అండగా నిలిచి మైనారిటీ కుటుంబానికి అన్యాయం చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. తిరుపాల్ రెడ్డి ఆక్రమించిన అక్బర్ బాషా భూమిని అప్పగించే బాధ్యత జగన్ రెడ్డి తీసుకోవాలని, బాషా కుటుంబం త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలని లోకేష్ డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments