Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంకెంత మంది ముస్లింలను బలిగొంటారు?:లోకేష్

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (23:22 IST)
కొంతమంది పోలీసులు పులివెందుల ఫ్యాక్షన్ ముఠా సభ్యుల్లా వ్యవహరిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ రెడ్డి కోసం ఇంకెంత మంది ముస్లిం మైనారిటీలను బలిగొంటారని ప్రశ్నించారు.

సీఎం బంధువు తిరుపాల్ రెడ్డి.. అక్బర్ బాషా భూమి కబ్జా చేస్తే.. బాషాని సీఐ ఎన్ కౌంటర్ చేస్తామనడం... కుటుంబమంతా సామూహిక ఆత్మహత్యాయత్నం చేస్తే కిడ్నాప్ చేయడం.. పోలీసుల విధులా? అని నిలదీశారు. అక్బర్ బాషా భూమి తిరిగిచ్చేశామని, వివాదం సమసిపోయిందని నమ్మించిన జగన్ రెడ్డి బృందం.. ‘దిక్కున్నచోట చెప్పుకో.. నీ భూమి ఇచ్చేది లేదని తేల్చేయడంతో బాషా కుటుంబంతో సహా మళ్లీ ఆత్మహత్య ప్రయత్నం చేసిందని’ అన్నారు.

అక్బర్ కుటుంబంలో ఏ ఒక్కరి ప్రాణాలకి ప్రమాదం ఏర్పడినా సీఎం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సీఎం బంధువుల కబ్జాలకు అండగా నిలిచి మైనారిటీ కుటుంబానికి అన్యాయం చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. తిరుపాల్ రెడ్డి ఆక్రమించిన అక్బర్ బాషా భూమిని అప్పగించే బాధ్యత జగన్ రెడ్డి తీసుకోవాలని, బాషా కుటుంబం త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలని లోకేష్ డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments