Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధం.. సుఫారీ ఇచ్చి భర్తను దిండుతో ఊపిరాడకుండా చేసి..?

Webdunia
శనివారం, 5 ఆగస్టు 2023 (08:31 IST)
వివాహేతర సంబంధాలు నేరాలను పెంచేస్తున్నాయి. వివాహేతర సంబంధాన్ని వదులుకోలేకపోయిన ఓ కానిస్టేబుల్ భార్య కట్టుకున్న భర్తను దారుణంగా హతమార్చింది. మద్యం తాగించి నిద్రపోతున్న సమయంలో దిండుతో ముఖాన్ని అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి చంపేసింది. 
 
అయితే ఆయనది సాధారణ మరణంగా చిత్రీకరించి దొరికిపోయింది. విశాఖ నగరంలోని ఓ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బర్రి రమేశ్ కుమార్ (40)-శివజ్యోతి అలియాస్ శివానీ భార్యాభర్తలు. ఎంవీపీ కాలనీలో నివసిస్తున్నారు. 
 
శివానీకి ఎదురింటి రామారావుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరిద్దరూ సన్నిహితంగా వుంటూ ఒకేసారి రమేశ్ కంటపడ్డారు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది. ఈ క్రమంలో గొడవలు మరింత ముదరడంతో భర్తను హత్యచేసి అడ్డుతొలగించుకోవాలని ప్లాన్ చేసింది. దీంతో ఒకటిన్నర లక్ష సుఫారీ ఇచ్చి భర్తను ప్రియుడితో కలిసి  హత్య చేయించింది. 
 
ఆపై తన భర్త గుండెపోటుతో మరణించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ప్రవర్తనను అనుమానించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆమెను అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగించారు. విచారణలో జ్యోతి నేరాన్ని అంగీకరించింది. ఆపై ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

పుష్ప 2 రికార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్ బీట్ చేయగలడా, అర్జున్.సినిమా లేనట్టేనా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments