చిత్తూరు జిల్లాలో మరో దారుణం జరిగింది. కాణిపాక వరసిద్ధివినాయకుని చెంత ఉండే ఒక వివాహితను దారుణంగా హత్య చేసి ఉరేశాడు భర్త. అదనపు కట్నం కోసమే తమ కుమార్తెను హత్య చేశాడని తల్లిడండ్రులు ఆరోపిస్తున్నారు.
ఈ వివరాలను పరిశీలిస్తే.. కాణిపాకంలో నివాసముంటున్న రూప(25), భాస్కర్ (28)కు సంవత్సరం క్రితం వివాహమైంది. వివాహానికి ముందు కొంత డబ్బును కట్నం కింద ఇస్తామని తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. అయితే అందులో కొంత డబ్బును మాత్రమే ఇచ్చి మిగిలిన డబ్బును తరువాత ఇస్తామని భాస్కర్ను ఒప్పించారు.
కానీ, వివాహమైన నెలరోజుల తరువాత నుంచి అదనపు కట్నం కోసం రూపను ప్రసాద్ వేధించేసాగాడు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో భాస్కర్ రూపను దారుణంగా కొట్టడంతో ఆమె మృతి చెందింది. విషయం బయటకు రాకుండా ఉండానే ఉద్దేశంతో రూపను ఇంట్లోని ఫ్యాన్కు ఉరేశాడు భాస్కర్. రూప ఆత్మహత్య చేసుకుందంటూ చుట్టుప్రక్కల వారిని నమ్మించే ప్రయత్నం చేశారు.
పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు విషయం బయటపడింది. రూప ఒంటిపై గాయాలు ఉండడంతో గుర్తించిన పోలీసులు భర్తను విచారించడంతో నిజం ఒప్పుకున్నాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.