Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాణిపాకంలో అదనపు కట్నం కోసం భార్యను చంపి ఉరేసిన భర్త

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (11:18 IST)
చిత్తూరు జిల్లాలో మరో దారుణం జరిగింది. కాణిపాక వరసిద్ధివినాయకుని చెంత ఉండే ఒక వివాహితను దారుణంగా హత్య చేసి ఉరేశాడు భర్త. అదనపు కట్నం కోసమే తమ కుమార్తెను హత్య చేశాడని తల్లిడండ్రులు ఆరోపిస్తున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే.. కాణిపాకంలో నివాసముంటున్న రూప(25), భాస్కర్‌ (28)కు సంవత్సరం క్రితం వివాహమైంది. వివాహానికి ముందు కొంత డబ్బును కట్నం కింద ఇస్తామని తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. అయితే అందులో కొంత డబ్బును మాత్రమే ఇచ్చి మిగిలిన డబ్బును తరువాత ఇస్తామని భాస్కర్‌‌ను ఒప్పించారు. 
 
కానీ, వివాహమైన నెలరోజుల తరువాత నుంచి అదనపు కట్నం కోసం రూపను ప్రసాద్‌ వేధించేసాగాడు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో భాస్కర్‌ రూపను దారుణంగా కొట్టడంతో ఆమె మృతి చెందింది. విషయం బయటకు రాకుండా ఉండానే ఉద్దేశంతో రూపను ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేశాడు భాస్కర్‌. రూప ఆత్మహత్య చేసుకుందంటూ చుట్టుప్రక్కల వారిని నమ్మించే ప్రయత్నం చేశారు. 
 
పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు విషయం బయటపడింది. రూప ఒంటిపై గాయాలు ఉండడంతో గుర్తించిన పోలీసులు భర్తను విచారించడంతో నిజం ఒప్పుకున్నాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments