Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియాంక గాంధీకి హెచ్‌పీ హైకోర్టు నోటీసులు.. మీ భూమి వివరాలు ఎందుకు వెల్లడించరాదు?

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (11:14 IST)
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీ వాద్రాకి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు నోటీసు జారీ చేసింది. సిమ్లాలో కొనుగోలు చేసిన భూమికి సంబంధించిన వివరాలను ఎందుకు బహిర్గతం చేయరాదో వెల్లడించకూడదో చెప్పాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 
 
గత యూపీఏ ప్రభుత్వ కాలంలో ప్రియాంకా గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రాలు సిమ్లాలో కొంత భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమికి సంబంధించిన సమగ్ర వివరాలు అందజేయాలని సమాచార హక్కు చట్టం ఉద్యమకారుడు దేవాశీష్ భట్టాచార్య దరఖాస్తు చేశారు. ఈ మేరకు సమాచారం ఇవ్వాల్సిందేనన్న రాష్ట్ర సమాచార కమిషన్ ఆదేశాలు జారీ చేశారు. 
 
ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రియాంకా గాంధీ ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. సమాచార కమిషన్ ఆదేశాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 
 
ఈ పరిస్థితుల్లో కేసు విచారణ శుక్రవారం జరిగింది. దీన్ని విచారించిన హైకోర్టు ప్రియాంకా గాంధీకి కోర్టు నోటీసులు జారీ చేసింది. సదరు భూమికి సంబంధించిన వివరాలు ఎందుకు వెల్లడి చేయరాదో తెలపాలంటూ ఆ నోటీసుల్లో కోర్టు ప్రియాంకా గాంధీని ఆదేశించింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని అందులో పేర్కొంది.

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments