Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధం.. సుఫారీ ఇచ్చి భర్తను దిండుతో ఊపిరాడకుండా చేసి..?

Webdunia
శనివారం, 5 ఆగస్టు 2023 (08:31 IST)
వివాహేతర సంబంధాలు నేరాలను పెంచేస్తున్నాయి. వివాహేతర సంబంధాన్ని వదులుకోలేకపోయిన ఓ కానిస్టేబుల్ భార్య కట్టుకున్న భర్తను దారుణంగా హతమార్చింది. మద్యం తాగించి నిద్రపోతున్న సమయంలో దిండుతో ముఖాన్ని అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి చంపేసింది. 
 
అయితే ఆయనది సాధారణ మరణంగా చిత్రీకరించి దొరికిపోయింది. విశాఖ నగరంలోని ఓ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బర్రి రమేశ్ కుమార్ (40)-శివజ్యోతి అలియాస్ శివానీ భార్యాభర్తలు. ఎంవీపీ కాలనీలో నివసిస్తున్నారు. 
 
శివానీకి ఎదురింటి రామారావుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరిద్దరూ సన్నిహితంగా వుంటూ ఒకేసారి రమేశ్ కంటపడ్డారు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది. ఈ క్రమంలో గొడవలు మరింత ముదరడంతో భర్తను హత్యచేసి అడ్డుతొలగించుకోవాలని ప్లాన్ చేసింది. దీంతో ఒకటిన్నర లక్ష సుఫారీ ఇచ్చి భర్తను ప్రియుడితో కలిసి  హత్య చేయించింది. 
 
ఆపై తన భర్త గుండెపోటుతో మరణించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ప్రవర్తనను అనుమానించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆమెను అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగించారు. విచారణలో జ్యోతి నేరాన్ని అంగీకరించింది. ఆపై ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamanna: ఓదెల 2లో మేకప్ లేకుండా భైరవి క్యారెక్టర్ చేయడం అదృష్టం : తమన్నా భాటియా

Sai Pallavi: రాత్రి 9 గంటలకల్లా నిద్రపోతాను.. ఉదయం 4గంటలకల్లా నిద్రలేస్తాను.. సాయిపల్లవి

రాజమౌళి వల్లే సినిమా ఒక్కటైంది, మేం తెలుగు సినిమాలు చూస్తాం : మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్

Sridevi: అమ్మా.. కాకినాడ శ్రీదేవి.. కృతిశెట్టి, శ్రీలీల, వైష్ణవిలా కావొద్దు.. కాస్త వెరైటీగా ఆలోచించు..?

Ivana: లవ్ టుడే.. ఆ కళ్ళతో కట్టిపారేసింది.. శ్రీదేవి, మీనా, రాశి బాటలో ఇవానా!?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments