Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుర్గ గుడి వరకు వచ్చి దర్శనం చేసుకోకుండానే వెళ్లిపోయిన బోండా ఉమ.. ఎందుకు..?

Webdunia
మంగళవారం, 16 అక్టోబరు 2018 (14:32 IST)
ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకునే బోండా ఉమ మరోసారి అలాంటిదే చేశారు. ఈసారి ఏకంగా శక్తి స్వరూపిణి అమ్మవారు కొలువైన దుర్గగుడిలోనే అలకపాన్పు ఎక్కారు. ఆలయ అధికారులు తనను పట్టించుకోలేదని, పట్టువస్త్రాలు సమర్పిస్తున్నా ప్రోటోకాల్ ప్రకారం స్థానికంగా ఎమ్మెల్యే తనను పిలవలేదని బాధపడ్డారు బోండా ఉమ. అధికారుల తీరుపై ఆగ్రహంతో ఊగిపోయారు.
 
అమ్మవారిని దర్శించుకోకుండానే వెనుతిరిగి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులను కూడా దర్శనానికి పోనివ్వకుండా ఇంటికి తీసుకెళ్ళిపోయారు బోండా ఉమ. దేవదాయ ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలతోనే తాము నడుచుకున్నామే తప్ప ఎమ్మెల్యేను అవమానించాల్సిన అవసరం మాకు లేదంటున్నారు దేవదాయ శాఖ అధికారులు. 
 
పట్టువస్త్రాలు సమర్పించే విషయం తాము చెప్పకున్నా ఎమ్మెల్యేగా బోండా ఉమ పాల్గొనవచ్చు అంటున్నారు. అయితే కావాలనే బోండా ఉమ అమ్మవారి చెంత రాద్దాంతం చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments