Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ లంచ్ ఏ పంచ్ కోసమో?

Webdunia
శనివారం, 8 ఆగస్టు 2020 (19:54 IST)
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, తాజా మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ శనివారం కలసి లంచ్ చేయడం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇద్దరి మధ్య వార్ నడుస్తోందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

సోము వీర్రాజు తెలుగు రాష్ట్రాలను చుట్టేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత హస్తినకు వెళ్లి కేంద్ర పెద్దలను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ ప్రముఖులను కలుస్తున్నారు. ఇటీవల కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవిని కలిశారు.

అలాగే జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. తాజాగా గుంటూరులో మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను ఆయన నివాసంలో సోము వీర్రాజు కలిశారు. అనంతరం ఇద్దరు కలిసి కన్నా నివాసంలో భోజనం చేశారు. మర్యాదపూర్వకంగానే ఈ భేటీ జరిగినట్లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ టైటిల్ చెన్నై లవ్ స్టోరీ

Nidhhi Agerwal: శింబుతో నిధి అగర్వాల్ ప్రేమాయణం.. పవన్ బ్యూటీ ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments