Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుపరిపాలన అందిస్తున్న రాష్ట్రాల పట్టికలో ఆంధ్రప్రదేశ్‌ది ఎన్నో స్థానం?

Webdunia
శనివారం, 31 అక్టోబరు 2020 (19:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయ స్థాయిలో తమ స్థానాన్ని పదిలపరుచుకుంది. ప్రజలకు ఉత్తమ పాలన అందిస్తున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడో స్థానం దక్కింది. పబ్లిక్ అఫైర్స్ సెంటర్ (పీఏసీ) ఈ మేరకు పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్-2020 జాబితా విడుదల చేసింది.
 
ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 0.531 పాయింట్లు లభించాయి. ఇక సుపరిపాలన అందిస్తున్న రాష్ట్రాలలో కేరళ అగ్రస్థానంలో ఉండగా తమిళనాడు తర్వాత స్థానంలో నిలిచింది. సమానత్వం, స్థిరత్వం, అభివృద్ది ప్రాతిపదికన ఈ ఎంపిక జరిగింది. ఈ జాబితాను రెండు కేటగిరీగా విభజించి అందులో అధిక జనాభా గల పెద్ద రాష్ట్రాలను ఒక జాబితాలో చేర్చారు.
 
అదేవిధంగా చిన్న రాష్ట్రాలను మరో జాబితాలో చేర్చారు. పెద్ద రాష్ట్రాల జాబితాలో కేరళ, తమిళనాడు, ఏపీ, కర్ణాటక టాప్ 4లో నిలిచాయి. యూపీ, బీహార్, ఒడిస్సా అడుగునపడ్డాయి. చిన్న రాష్ట్రాలలో గోవా అగ్ర స్థానంలో నిలిచింది. అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా ఈ జాబితా విడుదల చేశారు. అందులో చండీగడ్ అగ్ర స్థానంలో నిలిచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments