Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు ఏమైంది?.. బృందాకారత్ ఫైర్

Webdunia
బుధవారం, 31 జులై 2019 (08:15 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ నాయకురాలు బృందా కారత్. దేశంలో దళితులపై దాడులు జరుగుతుంటే 40ఏళ్ళ అనుభవం అంటూ నానా హంగామా చేసే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటూ విమర్శించారు.
 
40 ఇయర్స్ ఇండస్ట్రీ, తానే సీనియర్ పొలిటీషియన్ అంటూ పదేపదే చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని నిలదీశారు. దళితుల పేరుతో ఓట్లు పొంది వారు సమస్యల్లో ఉన్నప్పుడు పట్టించుకోరా అంటూ మండిపడ్డారు. వైసీపీది దళితులపై కపట ప్రేమ అంటూ మండిపడ్డారు.దళితుల దాడులపై బిల్లు తీసుకువచ్చే వరకు తాను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.  
 
మంగళవారం చిత్తూరు జిల్లా పలమనేరులో పర్యటించిన ఆమె మోదీ ప్రభుత్వంపైనా సెటైర్లు వేశారు. స్క్రూటినీ లేకుండానే మోదీ ప్రభుత్వం ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును పాస్‌ చేసిందని విమర్శించారు. పరువు హత్యలపై తాను గతంలో ప్రైవేటు బిల్లు పెట్టినా ఇప్పటికీ చట్టం జరుగలేదని విమర్శించారు. పరువు హత్యలపై ఎందుకు చట్టం చేయలేదో కారణం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments