Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొర్రెల‌ను వాగు దాటించి, ప్రాణాలు కాపాడిన ఎస్ఐ రమేష్

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (13:09 IST)
మ‌నుషుల‌కే కాదు, మూగ జీవాల‌కు కూడా పోలీసులే ర‌క్ష‌ణ అని నిరూపించారు...ఎస్.ఐ. ర‌మేష్. పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో కురిసిన కుండపోత వానతో వాగులు పొంగి పొరలడంతో ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితి ఏర్ప‌డింది. వసంతవాడ గ్రామం నుండి రుద్రకోట వెళ్లే దారిలో పెద్ద వంతెన వద్ద ప్రమాదకర స్థాయిలో నీరు ప్రవహించడంతో ఆయా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 
 
పెద్ద వంతెన దాటలేక రెండు వేల గొర్రెలు కొట్టుకుపోతూ ఉండగా, ఆ సమాచారాన్ని తెలుసుకున్న వేలేరుపాడు పోలీస్ స్టేషన్ ఎస్.ఐ పరిమి రమేష్ హుటాహుటిన అక్క‌డికి చేరారు. త‌న సిబ్బందితో ఆ ప్రదేశానికి చేరుకుని, గ్రామస్థుల సహకారంతో వాగులో దిగి,  గొర్రెలు కొట్టుకుపోకుండా సురక్షిత ప్రాంతానికి  తరలించారు. ప్రజల రక్షణ ఏ కాకుండా జంతువుల ప్రాణాల పట్ల కూడా బాధ్యత కలిగి ఉండాల‌ని సిబ్బందికి సూచించారు. ప్ర‌మాదకర స్థలానికి వచ్చి, మూగ జీవాల ప్రాణాలు కాపాడిన వేలేరుపాడు ఎస్ ఐ పరిమి రమేష్ ను, ఇత‌ర పోలీసు సిబ్బందిని ప్రజలు, గొర్రెల యజమానులు కొనియాడారు. వారికి కృతజ్ఞతలు తెలియపరిచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments