Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొర్రెల‌ను వాగు దాటించి, ప్రాణాలు కాపాడిన ఎస్ఐ రమేష్

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (13:09 IST)
మ‌నుషుల‌కే కాదు, మూగ జీవాల‌కు కూడా పోలీసులే ర‌క్ష‌ణ అని నిరూపించారు...ఎస్.ఐ. ర‌మేష్. పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో కురిసిన కుండపోత వానతో వాగులు పొంగి పొరలడంతో ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితి ఏర్ప‌డింది. వసంతవాడ గ్రామం నుండి రుద్రకోట వెళ్లే దారిలో పెద్ద వంతెన వద్ద ప్రమాదకర స్థాయిలో నీరు ప్రవహించడంతో ఆయా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 
 
పెద్ద వంతెన దాటలేక రెండు వేల గొర్రెలు కొట్టుకుపోతూ ఉండగా, ఆ సమాచారాన్ని తెలుసుకున్న వేలేరుపాడు పోలీస్ స్టేషన్ ఎస్.ఐ పరిమి రమేష్ హుటాహుటిన అక్క‌డికి చేరారు. త‌న సిబ్బందితో ఆ ప్రదేశానికి చేరుకుని, గ్రామస్థుల సహకారంతో వాగులో దిగి,  గొర్రెలు కొట్టుకుపోకుండా సురక్షిత ప్రాంతానికి  తరలించారు. ప్రజల రక్షణ ఏ కాకుండా జంతువుల ప్రాణాల పట్ల కూడా బాధ్యత కలిగి ఉండాల‌ని సిబ్బందికి సూచించారు. ప్ర‌మాదకర స్థలానికి వచ్చి, మూగ జీవాల ప్రాణాలు కాపాడిన వేలేరుపాడు ఎస్ ఐ పరిమి రమేష్ ను, ఇత‌ర పోలీసు సిబ్బందిని ప్రజలు, గొర్రెల యజమానులు కొనియాడారు. వారికి కృతజ్ఞతలు తెలియపరిచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments