Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి వచ్చిన అతిథులతో రక్తదానం చేయించిన కొత్త జంట

Webdunia
మంగళవారం, 29 డిశెంబరు 2020 (11:44 IST)
పెళ్లికి వచ్చిన అతిథులతో కొత్త జంట రక్తదానం చేయించిన ఘటన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జరిగింది. ఇంతకీ అసలు ఎందుకీ రక్తదానం చేసారు?
 
పిఠాపురానికి చెందిన నీలం దయాసాగర్‌ చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ కోఆర్డినేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. దయాసాగర్ వివాహం అదే పట్టణానికి చెందిన పద్మసాయి కృష్ణవేణితో ఆదివారం రాత్రి 10.35 గంటలకు జరిగింది. ఐతే ఈ పెళ్లికి వచ్చినవారు తమను ఆశీర్వదించడంతో పాటు రక్తదానం కూడా చేయాలని వరుడు దయాసాగర్ కోరాడు.
 
దయాసాగర్ విన్నపాన్ని మన్నించిన బంధుమిత్రులు నవ దంపతులను ఆశీర్వదించి ఆ తర్వాత రక్తదానం ఇచ్చారు. తన అభ్యర్థన మేరకు రక్తదానం చేసిన 35 మంది బంధుమిత్రులకు అభినందన తెలియజేసింది కొత్త జంట. కాగా రక్తదానం చేయించిన వరుడు దయాసాగర్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అమెరికాలో హాలీవుడ్ నటుడు కాల్చివేత

పుష్ప 2 లో సెకండ్ సింగిల్ ను 6 భాషల్లో పాడిన మెలోడీ క్వీన్ శ్రేయఘోషల్

కె.డి: ది డెవిల్స్ వార్ ఫీల్డ్ . రూ. 17.70 కోట్ల‌కు అమ్ముడైన‌ ఆడియోరైట్స్

గం..గం..గణేశా యాక్షన్ కామెడీ మూవీగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది - నిర్మాత వంశీ కారుమంచి

డ్యాన్స్ బేస్డ్ సినిమా చేయాలనే కోరిక ఉంది : హీరోయిన్ ఐశ్వర్య మీనన్

ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరికి థైరాయిడ్.. వామ్మో జాగ్రత్త

హైబీపి వుందా? ఐతే ఇవి తినకూడదు

కొలెస్ట్రాల్ అధికంగా వున్నవారు తినకూడని పదార్థాలు

ఎండాకాలంలో చర్మ సంరక్షణకు ఏం చేయాలి... ఈ జాగ్రత్తలు పాటిస్తే..?

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

తర్వాతి కథనం
Show comments