Webdunia - Bharat's app for daily news and videos

Install App

27న బంగాళాఖాతంలో వాయుగుండం

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2023 (17:51 IST)
బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు నెలకొనివున్నాయని భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రం వెల్లడించింది. ఈ నెల 27వ తేదీ నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకునివుని అల్ప పీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఈ నెల 29వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడుతుందని తెలిపింది. ఇది తుఫానుగా మారే అవకాశాలు ఉన్నట్టు ప్రైవేటు వాతావరణ సంస్థలు వెల్లడించాయి. 
 
ప్రస్తుతానికి దక్షిణ అండమాన సముద్రం పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ఐఎండీ వివరించింది. అటు గడిచిన 24 గంటసల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైంది. తమిళనాడులోని మేట్టుపాళెయంలో అత్యధికంగా 37 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

స్టేడియంకు పాపులు వెళ్లడం వల్లే భారత్ ఓడిపోయింది : మమతా బెనర్జీ  
 
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భారత క్రికెట్ జట్టు లీగ్ దశ నుంచి సెమీ ఫైనల్ మ్యాచ్ వరకు అన్ని మ్యాచ్‌లు గెలుచుకుంటూ వచ్చారని, ఫైనల్ మ్యాచ్‌కు మాత్రం స్టేడియానికి పాపులు వెళ్ళి టీమిండియాను ఓడించారని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఆటగాళ్ళు వేసుకునే జెర్సీలను కూడా కాషాయం రంగులో తయారు చేశారంటూ ఆమె మండిపడ్డారు. 
 
ఈ నెల 19వ తేదీన అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌ను మోడీ స్టేడియంలో కాకుండా, లక్నోలో పెట్టివుంటే భారత్ గెలిచివుండేదని, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. తాజాగా ఇదే అంశంపై వెస్ట్ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా స్పందించారు.
 
ప్రపంచ కప్ ప్రతి మ్యాచ్‌లో భారత్ గెలిచింది. కానీ ఫైనల్స్‌కు పాపులు వచ్చారని, ఫైనల్స్‌ ఓడిపోవడానికి ఆ పాపులు మ్యాచ్‌కు రావడమే కారణమని మమత విమర్శించారు. అహ్మదాబాద్‌లో కాకుండా ముంబైలోని వాంఖడే స్టేడియంలోగానీ, కోల్‌‍కతా ఈడెన్ గార్డెన్స్‌లోగానీ ఫైనల్ మ్యాచ్ నిర్వహించివుంటే భారత్ ఖచ్చితంగా విశ్వవిజేతగా నిలిచేదిని వెల్లడించారు. దేశాన్ని కాషాయమయం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తుందని మమత విమర్శించారు. భారత్ ప్రాక్టీస్ చేసే సమయంలో ధరించే జెర్సీలను కూడా కాషాయ రంగులో తయారు చేశారని, తద్వారా జట్టును కూడా కాషాయికరించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments