Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు రోజుల్లో ప్రవేశించనున్న రుతుపవనాలు... ఏపీకి మూడు రోజుల వర్ష సూచన

Webdunia
సోమవారం, 22 మే 2023 (15:56 IST)
మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ రుతపవనాలు ప్రవేశించేందుకు సానుకూల పరిస్థితులు ఉన్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ తమిళనాడు పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు తెలిపింది. 
 
ఉత్తర-దక్షిణ ద్రోణి ఇప్పుడు విదర్భ నుండి దక్షిణ తమిళనాడు మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా సముద్ర మట్టానికి ౦.9 కి.మీ ఎత్తున విస్తరించి ఉన్నట్లు తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 
 
ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని తెలిపింది. ఒకటి రెండు చోట్ల గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశముందని తెలిపింది. బుధవారం కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. కొన్ని చోట్ల గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలు వీచే అవకాశమున్నట్లు వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూన్ లో చిరంజీవి షూటింగ్ ప్రారంభిస్తామన్న అనిల్ రావిపూడి

మిథున్ చక్రవర్తి లవ్ స్టొరీ బిగిన్స్ చిత్రం మొదలైంది

David Warner: రాబిన్ హుడ్‌ సినిమాలో డేవిడ్ వార్నర్... నితిన్, శ్రీలీల చిత్రాల్లో ఎలా కనిపిస్తారో?

రాణి భార‌తి ఈజ్ బ్యాక్‌! చ‌దువు రాని ఓ గృహిణి నుంచి రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా.. (video)

స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments