Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్యానికి మా దగ్గర డబ్బులు లేవు, మా పాపను చంపేందుకు అనుమతినివ్వండి

Webdunia
గురువారం, 10 అక్టోబరు 2019 (20:55 IST)
అసలే పేద కుటుంబం. పూటగడవడమే కష్టమైన పరిస్థితి. కూలీ పని చేస్తే వచ్చే డబ్బులతో ఏ పూటకాపూట గడవడమే కష్టసాధ్యమైన స్థితి. అలాంటి కుటుంబంలో చిన్నారికి నయంకాని జబ్బు వచ్చింది. ఉన్న కాస్తంత ఇంటిని అమ్మి చిన్నారికి చికిత్స చేయించారు. అయితే ఆర్థిక స్థోమత లేకపోవడంతో చిన్నారిని బతికించుకునే మార్గం లేక చంపేయమని ప్రాధేయపడుతున్నారు.
 
చిత్తూరు జిల్లా మదనపల్లి మొదటి సెషన్స్ కోర్టులో కారుణ్య మరణానికి అర్జీ పెట్టుకున్నారు చిన్నారి సుహాని తల్లిదండ్రులు. సుహాని స్వస్థలం బి.కొత్తకోట మండలం బి.సి.కాలనీ. ఆ చిన్నారి వయస్సు ఒక సంవత్సరం. తల్లిదండ్రులు బావాజాన్, షబానా. వీరిది మేనరిక వివాహం. పుట్టినప్పటి నుంచి షుగర్ లెవల్స్ పడిపోయి అనారోగ్యంతో బాధపడేది. ప్రతిరోజు ఆరుగంటలకు ఒకసారి 2,400 రూపాయల ఇంజెక్షన్ చిన్నారికి వేయాలి. 
 
అప్పులు చేసి మరీ 12 లక్షల రూపాయల వరకు తల్లిదండ్రులు సుహానాకు ఖర్చు పెట్టారు. అయితే ఇక ఆర్థిక స్థోమత సరిపోక చిన్నారిని బతికించుకునే మార్గం లేక మదనపల్లి కోర్టులో కారుణ్యమరణానికి అర్జీ పెట్టుకున్నారు. వైద్యానికి ఎంత అవసరమైతే అంత మొత్తాన్ని దాతలు ఇవ్వాలని.. లేకుంటే సుహాని కారుణ్య మరణానికి అనుమతించాలని తల్లిదండ్రులు కోరారు. కూలి పనిచేస్తూ జీవనం సాగించే తమకు సుహానిని చంపుకోవడం తప్ప ఇక చేసేదేమీ లేదని బోరున విలపిస్తున్నారు తల్లిదండ్రులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments