Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాగా జలుబు పట్టిందా.. అయితే ఇలా చేయండి..

బాగా జలుబు పట్టిందా.. అయితే ఇలా చేయండి..
, బుధవారం, 2 అక్టోబరు 2019 (11:57 IST)
చాలా మంది జలుబు చేసినప్పటికీ ఆఫీసులకు వెళుతుంటారు. పైగా, దాన్నిపెద్దగా పట్టించుకోకుండా తమ రోజువారి విధుల్లో నిమగ్నమైపోతారు. నిజానికి జలుబు చేసినట్టయితే చిన్నపాటి చిట్కాలు ఇంటిపట్టునే పాటిస్తే సరిపోతుంది. అవేంటో ఇపుడు తెలుసుకుందాం. 
 
తుమ్ములు, జలుబుతో బాధపడుతూ ఉద్యోగానికి వెళ్లడం సరైంది కాదు. అలాగే తల, శరీరం నొప్పులు, జ్వరం లాంటివి ఉన్నప్పుడు, తుమ్ములతో జలుబు మొదలైనప్పుడు పారాసిటమాల్ బిళ్లలు, వేపొరబ్స్ లాంటివి వాడినా అవి శాశ్వత పరిష్కారం కాదు. 
 
ఆయా సీజన్లలో వచ్చే జలుబులకు సరైన చికిత్స చేయకపోతే అవి క్రమంగా ఆస్తమాగా మారే అవకాశం ఉందని అలర్జీల వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జలుబు చేసి తుమ్మినప్పుడు వెలువడే సూక్ష్మజీవులు ఇతరులకు వ్యాపించి వారికి కూడా జలుబు సోకుతుంది. అందువల్ల జలుబు చేసినప్పుడు ఆఫీసుకు వెళ్లి ఇతరులకు దాన్ని వ్యాపింపచేయడం కంటే విశ్రాంతి తీసుకోవడం ఉత్తమమని నిపుణుల చెపుతారు. 
 
జలుబు సాధారణంగా 7 నుంచి 12 రోజులలో తగ్గుతుంది. ఇలాంటి వైరల్ వ్యాధులకు యాంటీ బయోటిక్స్ వాడటం కంటే హాయిగా విశ్రాంతి తీసుకోవడమే మంచిది. వేడి నీటిలో పసుపు లేదా ఏదైనా బామ్ వేసి ఆవిరి పట్టడం లేదా మరిగిన నీటి ఆవిరిని పట్టి, విశ్రాంతి తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
 
చీదినప్పుడు, దగ్గినప్పుడు రక్తం పడుతుందా...? అని గమనించాలి. అలా రక్తం పడితే అది తీవ్రమైన రుగ్మతగా గమనించాలి. స్వల్పంగా తలనొప్పి, జలుబు అయినప్పుడు తగినంత విశ్రాంతి అన్నిటికి మంచిది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోళ్లపై తెల్లతెల్లని మచ్చలుంటే ఏమవుతుంది?