అమరావతి స్మార్ట్ సిటీకి కేంద్రం షాక్.. నిధుల కేటాయింపునకు నో...

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2023 (11:10 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతి స్మార్ట్ సిటీ నిర్మాణం కోసం కేంద్రం రూ.930 కోట్ల నిధులను ఇచ్చినట్టు కేంద్ర మంత్రి కౌశల్ కిశోర్ తెలిపారు. ఇదే అంశంపై ఆయన పార్లమెంట్‌లో మాట్లాడుతూ, అమరావతిలో 930 కోట్ల రూపాయల విలువైన 19 ప్రాజెక్టులను చేపట్టినట్టు ఆయన వెల్లడించారు. ఇందులో రూ.627.15 కోట్ల విలువైన 12 ప్రాజెక్టులు పూర్తికాగా, రూ.302.86 కోట్ల విలువైన ఏడు ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తన వాటా నిధులు మొత్తాన్ని ఇప్పటికే ఇచ్చినందున తదుపరి కేటాయింపు ప్రతిపాదనేదీ లేదని స్పష్టంచేసింది. సోమవారం టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి కిశోర్ పై విధంగా సమాధానమిచ్చారు. 
 
విశాఖపట్నంలో స్మార్ట్ సిటీ కింద రూ.942 కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టగా, ఇప్పటివరకు రూ.452.25 కోట్లు ఖర్చు చేసినట్టు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. అమృత్ పథకం కింద విజయనగరంలో రూ.46.96 కోట్ల విలువైన పనులు చేపట్టినట్టు వైకాపా ఎంపీ విజయసాయి రె్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇందులో రెండు నీటి సరఫరా ప్రాజెక్టులు, ఒక మురుగు నీటి పారుదల వ్యవస్థ, మూడు పార్కులు ఉన్నాయని, ఇవన్నీ పూర్తయ్యాయని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పుకున్న డైరెక్టర్.. బాధ్యతలు స్వీకరించిన విశాల్

Naveen Polishetty: అనగనగా ఒక రాజు తో సంక్రాంతి పోటీలో నవీన్ పోలిశెట్టి

రాజ్‌తో కలిసి సమంత దీపావళి వేడుకలు.. ఇక పెళ్లే మిగిలివుందా?

బాలీవుడ్‌లో చిరునవ్వుల నటుడు అస్రానీ ఇకలేరు

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments