Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి స్మార్ట్ సిటీకి కేంద్రం షాక్.. నిధుల కేటాయింపునకు నో...

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2023 (11:10 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతి స్మార్ట్ సిటీ నిర్మాణం కోసం కేంద్రం రూ.930 కోట్ల నిధులను ఇచ్చినట్టు కేంద్ర మంత్రి కౌశల్ కిశోర్ తెలిపారు. ఇదే అంశంపై ఆయన పార్లమెంట్‌లో మాట్లాడుతూ, అమరావతిలో 930 కోట్ల రూపాయల విలువైన 19 ప్రాజెక్టులను చేపట్టినట్టు ఆయన వెల్లడించారు. ఇందులో రూ.627.15 కోట్ల విలువైన 12 ప్రాజెక్టులు పూర్తికాగా, రూ.302.86 కోట్ల విలువైన ఏడు ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తన వాటా నిధులు మొత్తాన్ని ఇప్పటికే ఇచ్చినందున తదుపరి కేటాయింపు ప్రతిపాదనేదీ లేదని స్పష్టంచేసింది. సోమవారం టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి కిశోర్ పై విధంగా సమాధానమిచ్చారు. 
 
విశాఖపట్నంలో స్మార్ట్ సిటీ కింద రూ.942 కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టగా, ఇప్పటివరకు రూ.452.25 కోట్లు ఖర్చు చేసినట్టు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. అమృత్ పథకం కింద విజయనగరంలో రూ.46.96 కోట్ల విలువైన పనులు చేపట్టినట్టు వైకాపా ఎంపీ విజయసాయి రె్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇందులో రెండు నీటి సరఫరా ప్రాజెక్టులు, ఒక మురుగు నీటి పారుదల వ్యవస్థ, మూడు పార్కులు ఉన్నాయని, ఇవన్నీ పూర్తయ్యాయని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కథ, కథనాల మీదే నడిచే సినిమా రా రాజా చూసి సక్సెస్ చేయాలి: దర్శకుడు బి. శివ ప్రసాద్

నేను చెప్పింది కాకపోతే ఇకపై జడ్జిమెంట్ ఇవ్వను : రాజేంద్రప్రసాద్

Chitra Purushotham: ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్‌కు ఫోజులిచ్చి ఆన్‌లైన్‌‌లో వైరల్ (Video)

అమ్మాయిలు క్యూట్ గా అలాంటి తప్పులు చేస్తే మాకు బాగా నచ్చుతుంది : హీరో నితిన్

అట్లీతో అల్లు అర్జున్ సినిమా.. ఐదుగురు హీరోయిన్లు నటిస్తారట?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments