Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనకు మరో అణు క్షిపణి

Webdunia
సోమవారం, 20 జనవరి 2020 (06:10 IST)
భారత అమ్ములపొదిలో మరో అణు క్షిపణి చేరింది. రెండు వరుస వైఫల్యాల తరువాత ఎట్టకేలకు కే4 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. విశాఖపట్నం నుంచి 30 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రంలో ఏర్పాటు చేసిన లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఈ క్షిపణి ఛేదించింది.

ఆదివారం నిర్వహించిన ఈ ప్రయోగం విజయవంతమైందని, అణు జలాంతర్గామి నుంచి 3500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఈ క్షిపణి ఛేదించగలదని డీఆర్డీవో తెలిపింది. ఈ బాలిస్టిక్ క్షిపణిని ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌లో అమర్చేలా అభివృద్ధి చేశామని, 17 టన్నుల బరువుండే ఈ క్షిపణి రెండు టన్నుల వార్‌హెడ్‌ను మోసుకుపోగలదని డీఆర్డీవో తెలిపింది.

ఇదిలా ఉంటే 2019 నవంబర్‌లోనే ఈ క్షిపణి ప్రయోగం జరగాల్సిఉంది. కానీ అప్పట్లో బంగాళాఖాతంలో బుల్‌బుల్‌ తుపాన్‌ తీవ్రంగా ఉండడంతో ప్రయోగం వాయిదా పడింది. అయితే ఆదివారం నిర్వహించిన ప్రయోగం విజయవంతం కావడంతో సముద్రతలం నుంచి అణు క్షిపణులను ప్రయోగించగల ఆరో దేశంగా భారత్ అవతరించింది.

ఈ క్షిపణిని అణు జలాంతర్గాముల్లో అమర్చి సైన్యం చేతికి అందించేలోపు మరికొన్నిసార్లు ప్రయోగాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు డీఆర్డీవో తెలిపింది. డీఆర్డీవో అధికారులకు ఏపీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments