Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజులే లేనపుడు రాజద్రోహం కేసు నమోదా? : లక్ష్మీనారాయణ ప్రశ్న

Webdunia
ఆదివారం, 17 అక్టోబరు 2021 (08:34 IST)
మన దేశంలో రాజులే లేనపుడు రాజద్రోహం అభియోగం ఎలా అమలవుతుందని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. అందువల్ల ప్రజాస్వామ్య భారతావనిలో నేటికీ రాజద్రోహం నేరాభియోగం అమలు చేయడం తగదని ఆ విధానం పోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో జేడీ(జాయిన్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌) సంస్థ వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా యువతతో నిర్వహించిన చర్చాగోష్ఠిలో పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. రాజులే లేనప్పుడు రాజద్రోహ అభియోగం ఎలా అమలవుతుందని ప్రశ్నించారు. న్యాయమూర్తులూ ఇదే అభిప్రాయం వెలిబుస్తున్నారన్నారు. 
 
'ప్రభుత్వం నూతన ఆర్థిక వనరులు సృష్టించాలే తప్ప... ప్రజలపై పన్నుల రూపంలో భారం మోపడం తగదు. ఇంధన విక్రయాలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే పెట్రోల్‌ రూ.65, డీజిల్‌ రూ.45కే లభ్యమయ్యే అవకాశం ఉంది. మితిమీరిన సుంకాలను ప్రజలు మూకుమ్మడిగా వ్యతిరేకిస్తే పాలకులే తోకముడుస్తారు. 
 
ఇందుకు బ్రిటిష్‌ హయాంలో చీరాల, పేరాల ఉద్యమమే ఉదాహరణ. రైతులు సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ విధానాలు పాటించడం ద్వారా ప్రజారోగ్య ప్రమాణాలు పెంచిన వారవుతారు' అని జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments