Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ అభ్యర్థి కంటే నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చాయ్ తెలుసా?

Webdunia
గురువారం, 23 మే 2019 (18:22 IST)
ఏపీలో వైఎస్సార్సీపీ విజయం ఖాయమైపోయింది. టీడీపీకి చెందిన ప్రముఖులు కూడా ఓటమి చవిచూడబోతున్నారు. మరోవైపు విశాఖ జిల్లా అరుకు అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ తరుపున పోటీ చేసిన మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ కంటే నోటాకే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. గతేడాది మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన కిడారి సర్వేశ్వరరావు కుమారుడికి చంద్రబాబు అప్పుడు మంత్రి పదవి ఇచ్చారు. 
 
తర్వాత ఈ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి శ్రవణ్ కుమార్‌ను నిలబెట్టారు. అయితే అరుకులో తండ్రి సెంటిమెంట్ ఏమాత్రం పనిచేయలేదు. ఫ్యాన్ గాలికి సైకిల్ కొట్టుకుపోయింది. నోటాకు వచ్చిన ఓట్లు కూడా టీడీపీ అభ్యర్థికి రాలేదు. తాజా మాజీ మంత్రిగా పని చేసిన శ్రవణ్ కుమార్ కంటే నోటాకు ఎక్కువ ఓట్లు పోలవ్వడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments