తెలుగు రాష్ట్రాల్లో ఎల్లుండి ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఓటర్లకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. అందులో భాగంగా ఫోటో ఓటర్ స్లిప్లను గుర్తింపు కార్డులుగా పరిగణించడం లేదని, ఈసీఐ ఆదేశాల మేరకు ఎపిక్ (ఓటరు గుర్తింపు) కార్డు లేదా మరో 11 రకాల కార్డుల్లో ఏదైనా ఒకటి పోలింగ్ కేంద్రానికి తీసుకురావాలని ఓటర్లకు సీఈవో సూచించారు.
1) పాస్పోర్ట్,
2) డ్రైవింగ్ లైసెన్స్,
3) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు/ ప్రభుత్వరంగ సంస్థలు/ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీచేసిన ఉద్యోగుల ఫోటో గుర్తింపుకార్డు,