ఓటర్ల జాబితా ప్రత్యేక సమ్మరీ రివిజన్ షెడ్యూల్ విడుదల

Webdunia
మంగళవారం, 17 డిశెంబరు 2019 (07:53 IST)
భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమ్మరీ రివిజన్‌కు షెడ్యూల్‌ను ప్రకటించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్ తెలిపారు.

జనవరి 1 క్వాలిఫైయింగ్ తేదీకి అనుగుణంగా మోడిఫైడ్ షెడ్యూల్‌ను విడుదల చేయడం జరిగిందని ఆ ప్రకారం ఈ నెల 23న ఇంటిగ్రేటెడ్ డ్రాప్టు ఎలక్టోరల్ రోల్ పబ్లికేషన్ చేయడం జరగుతుందని తెలిపారు. డిశంబరు 23 నుండి జనవరి 22వ తేదీ వరకూ ముసాయిదా ఓటర్ల జాబితా ( డ్రాప్టు ఎలక్టోరల్ రోల్)పై క్లెయిమ్లు అభ్యంతరాలను స్వీకరించడం జరుగుతుందని చెప్పారు.

ఆ విధంగా వచ్చిన క్లెయమ్లు మరియు అభ్యంతరాలను వచ్చే ఫిబ్రవరి 3వ తేది నాటికి పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఫిబ్రవరి 11వ తేదీన సప్లిమెంట్స్ సిద్ధం చేయడం జరుగుతుందని, తదుపరి ఫిబ్రవరి 14వతేదీన ఓటర్ల తుది జాబితాను ప్రచురించడం జరుగుతుందని ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments