Webdunia - Bharat's app for daily news and videos

Install App

భక్తులు చింతించకండి, రాములోరి కళ్యాణాన్ని మీరూ చూడొచ్చు, ఎలా?

Webdunia
సోమవారం, 6 ఏప్రియల్ 2020 (19:23 IST)
కరోనా దెబ్బతో టిటిడి ముఖ్య ఆలయాన్ని ఇప్పటికే భక్తుల అనుమతిని రద్దు చేసింది. అయితే కొన్ని ఆలయాలను మాత్రమే తెరిచి ఉంచి ఏకాంతంగా సేవలను కొనసాగిస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు కడప జిల్లాలోని ఒంటిమిట్ట ఆలయంలోను ఏకాంతంగా కైంకర్యాలు జరుగుతున్నాయి. 
 
అయితే ఒంటిమిట్ట ఆలయంలో ప్రతియేటా రాములవారి కళ్యాణోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహిస్తారు. వేలాదిమంది ప్రజలు కళ్యాణోత్సవాన్ని నేరుగా తిలకిస్తారు. కళ్యాణోత్సవం రోజు అధికసంఖ్యలో భక్తులు ఒంటిమిట్టలో కిక్కిరిసి కనిపిస్తారు. 
 
అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో భక్తులెవరినీ దర్సనానికి అనుమతించడం లేదు. కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు కూడా భక్తులకు నో ఎంట్రీ అంటూ బోర్డులు పెట్టారు. కానీ రేపు జరిగే రామయ్య కళ్యాణోత్సవాన్ని టిటిడి ఆధ్వర్యంలో నడుపబడే శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌లో తిలకించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. రేపు రాత్రి గంటల నుంచి 9 గంటల వరకు ఏకాంతంగా కళ్యాణాన్ని నిర్వహించనున్నారు.
 
భక్తులందరూ ఇళ్ళ నుంచే భక్తిఛానల్ లో స్వామి, అమ్మవార్ల కళ్యాణాన్ని వీక్షించే అవకాశాన్ని కల్పిస్తోంది టిటిడి. నిరంతరం కళ్యాణోత్సవం ముగిసేంత వరకు భక్తులందరూ స్వామివారిని టివీల్లో వీక్షించవచ్చని టిటిడి ఉన్నతాధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments